Nandyala: ఇంటర్ విద్యార్థుల మధ్య ఘర్షణ.. శిరోముండనం చేయించిన యాజమాన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandyala: సాధారణంగా విద్యార్థుల మధ్య కొన్ని సార్లు మనస్పర్థలు రావడం సహజం.. ఆ తరువాత అవన్నీ మర్చిపోయి అందరూ కలిసిపోవడం సహజం.. అయితే ఇది ఒకప్పటి మాట.. ఇపుడు కాలం మారింది. కలిసి కట్టుగా ఉండాల్సిన విద్యార్థులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. చదువుకుంటారని తల్లిదండ్రలు పిల్లలను కళాశాలకు పంపిస్తే.. ప్రస్తుతం కళాశాలకు వెళ్లిన కొందరు విద్యార్థులు చదువుకోవడం మానేసి.. ఘర్షణలకు పాల్పడుతున్నారు. అయితే విద్యార్థుల మధ్య తలెత్తుతున్న ఘర్షణలకు విసుగిపోయారేమోగాని..కళాశాల యాజమాన్యం విచక్ష కోల్పోయారు. ఘర్షణకు పాల్పడిన విద్యార్థులను దండించడానికి వాళ్ళకి గుండు గీయించారు. అలానే కొందరు విద్యార్థులను తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన నాధ్యాలలో చోటు చేసుకుంది.
Read also:Rishab: నేను కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలి పోను… శెట్టి కౌంటర్ ప్రశాంత్ నీల్ కేనా?
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
వివరాలలోకి వెళ్తే.. సోమవారం రాత్రి నాధ్యాల జిల్లా లోని ఓ ప్రైవేటు కళాశాలలో సీనియర్, జూనియర్ విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కాగా విద్యార్థుల మధ్య తలెత్తిన ఘర్షణ కళాశాల యాజమాన్యం దగ్గరకు చేరింది. ఈ నేపథ్యంలో మంగళవారం కళాశాల యాజమాన్యం విద్యార్థులను దండించే క్రమంలో కర్రలతో విద్యార్థులను కొట్టారు. దీనితో విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా ఓ విద్యార్థికి చెయ్యి విరిగింది. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలానే కళాశాల యాజమాన్యం.. ఘర్షణకు పాల్పడిన మరో 6 మంది విద్యార్థులకు శిరోమండనం చేయించారు. విద్యార్థుల పైన ఆ కళాశాల యాజమాన్యం స్పందించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కళాశాల యాజమాన్యం ప్రవర్తించిన తీరుకి యదా రాజా తదా ప్రజా అన్నట్లు అయ్యిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!