ఓ వైపు పీఆర్సీ పై చర్చలు కొనసాగుతుండగానే ఏపీ ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జీతాలు, పెన్షన్ల బిల్లుల ప్రక్రియపై మరోసారి ఆర్థిక శాఖ సర్య్కూలర్ను జారీ చేసింది. కొత్త పే స్కేళ్ల ప్రకారమే జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయాలని అధికారులకు సూచించింది. సర్య్కూలర్ ప్రకారం నిర్దేశిత గడువులోగా జీతాలు, పెన్షన్ల బిల్లుల ప్రక్రియను చేపట్టకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరికలు పంపింది. డీడీఓలు, పీఏఓలు, ట్రెజరీ అధికారులకు చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
Read Also: తిరిగి మేమే అధికారంలోకి వస్తాం: జీవీఎల్
జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే అంశంపై టైమ్ లైన్ నిర్దేశిస్తూ సర్కులర్ను జారీ చేసిన ఏపీ ఆర్థిక శాఖ. ఇవాళ సాయంత్రంలోగా బిల్లులను అప్ లోడ్ చేయాలని డీడీఓలకు ప్రభుత్వం సూచనలు చేసింది. రేపటిలోగా అప్లోడ్ చేసిన బిల్లులను ప్రాసెసష్ చేయాల్సిందిగా పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలిచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి జీతాలు జమయ్యేలా చూడాలని ట్రెజరీ అధికారులకు ఆర్థిక శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కార్యదర్శులకు, హెచ్వోడీలకు, కలెక్టర్లకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.