Family Missing Mystery: తీర్థయాత్రలకు వెళ్లి.. తిరిగిరాని వ్యాపారి కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోట్ల రూపాయల అప్పులకు ఐపీ పెట్టి ఓ వస్త్ర వ్యాపారి కుటుంబం పరారైన ఘటన కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో కలకలం రేపింది. తీర్థ యాత్రలకు వెళ్లిన వస్త్ర వ్యాపారి కుటుంబం పది రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతోపాటు సెల్ ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటం అనుమానంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. 60 సంవత్సరాల క్రితం గ్రామానికి వలస వచ్చిన మల్లూరి ఆదినారాయణ తన వ్యాపారాన్ని వస్త్ర మూటల ద్వారా మొదలుపెట్టారు.
Read Also: Bhatti Vikramarka: కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు.. ఆమె ఇచ్చారు
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
కాలక్రమేణా వస్త్ర దుకాణం ఏర్పాటు చేసుకుని తన ముగ్గురు కుమారులకు అప్పగించారు.. రెండవ కుమారుని కొడుకు మల్లూరి రమేష్ తన తాత ఆదినారాయణ పేరు మీద గత 20 సంవత్సరాలుగా వస్త్ర దుకాణం నిర్వహిస్తూ ప్రజలలో విశ్వాసం సంపాదించాడు… విశ్వాసమే పెట్టుబడిగా గ్రామస్తులు నుండి సుమారు 40 కోట్ల రూపాయల మేర అప్పులు చేసి వ్యాపారం నిర్వహిస్తుండగా కొందరు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పట్టు పట్టడంతో తన ఆస్తులను అమ్మి సుమారు 17 కోట్ల రూపాయల అప్పులు తీర్చినట్లు సమాచారం.
మిగిలిన వారికి సంక్రాంతి పండుగ వ్యాపారం అనంతరం డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పి… 10 కోట్ల రూపాయలతో ఈ నెల నాలుగవ తేదీన కుటుంబంతో సహా తిరుపతి వెళుతున్నట్లు గ్రామంలో నమ్మబలికి ఉడాయించినట్లు సమాచారం… దీంతో బాధితులు అవాక్కయ్యారు. వస్త్ర వ్యాపారి రమేష్ 40 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.. రమేష్ కుటుంభాన్ని పట్టుకుని తమకు న్యాయం చేయాలంటూ పెదపూడి పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు రమేష్ కుటుంబం తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి రాలేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పెదపూడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: Rashmika Mandanna: ఐదేళ్లలో ఐదు లగ్జరీ ప్లాట్స్ కొన్న రష్మిక..?
తాజావార్తలు
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!