Amaravati Padayatra: నిడదవోలులో ఉద్రిక్తత.. జేఏసీ వర్సెస్ రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రైతుల మహా పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. నిడదవోలు ఓవర్ బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరావతి రైతులకు వ్యతిరేకంగా జేఏసీ నేతల నినాదాలతో హోరెత్తింది. మూడు రాజధానులు ముద్దు, ఫేక్ యాత్రికులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు జేఏసీ నేతలు. అక్కడికి భారీగా చేరుకున్న వైసీపీ నేతలు, నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. అమరావతి రైతు యాత్ర ఇక్కడికి చేరుకోవడంతో భారీగా మోహరించిన పోలీసులు, పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. నిడదవోలులో రైతుల పాదయాత్ర పైకి దూసుకు వచ్చేందుకు ప్రయత్నించారు జేఏసీ, వైసీపీ నేతలు. వెంటనే అదుపు చేశారు పోలీసులు, రైతులు మద్దతు దారులు, జేఏసీ నాయకులు పోటా పోటీ నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇదిలా వుంటే.. అయిదేళ్లు చంద్రబాబు పాలనలో అమరావతిలో షెడ్లు కూడా నిర్మించలేకపోయారన్నారు. విజయవాడలో ఆఫీస్ లు పెట్టి అమరావతిలో పెట్టామని చెప్పుకున్నారు..అమరావతి రైతుల యాత్రను చంద్రబాబే నడుపుతున్నాడు..వెనుకబడిన ఉత్తరాంధ్ర లో రాజధాని ఉండాలి…అటవీప్రాంతం వంటి అమరావతి ఎప్పటికీ అభివృద్ధి చెందదు.. చంద్రబాబు అమరావతి రాజధాని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు డిప్యూటీ స్పీకర్, కోలగట్ల వీరభద్రస్వామి.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
లక్ష మందితో విశాఖ గర్జన ర్యాలీ వుంటుందన్నారు విశాఖ సీపీ శ్రీకాంత్. 3.7కి.మీ. దూరం జేఏసీ పాదయాత్ర.. ..పవన్ కళ్యాణ్ పర్యటన, టీడీపీ మీటింగ్, గర్జన ఒకే రోజు ఉండటంతో 1000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశామన్నారు. పవన్ కళ్యాణ్ టూర్ మధ్యాహ్నం ఉంటుందన్నారు. .ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రావడంతో గర్జన జరిగే సమయంలో ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ టూర్ సందర్భంగా ర్యాలీ కోసం జనసేన ఎటువంటి అనుమతి కోరలేదన్నారు విశాఖ సీపీ శ్రీకాంత్.
Read Also: Assam CM: అస్సాం ముఖ్యమంత్రికి ‘జెడ్ ప్లస్’ సెక్యూరిటీ.. అందుకేనా?
విశాఖ గర్జన కార్యక్రమం ఫెయిల్ చేయాలనే పవన్ కళ్యాణ్ 15 న జనవాణి కార్యక్రమం ప్రకటించారని మండిపడ్డారు మంత్రి అమర్నాథ్.. పవన్ కళ్యాణ్ మాకు చీరలు ఇస్తా అంటున్నారు…వైసీపీ నాయకులకు చీరలు ఇచ్చే బదులు, భార్యాభర్తలుగా కలిసి తిరుగుతున్న మనోహర్ కి ఆ చీర ఇవ్వాలని ఎద్దేవా చేశారు. రేపు నాన్ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన విశాఖ గర్జనకు వైసీపీ పూర్తి మద్దతు వుంటుందన్నారు. విశాఖ గర్జన ర్యాలీలో లక్షలాది మంది పాల్గొంటారని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఉందన్నారు.. వెనుకబడిన ఉత్తరాంధ్రకు రాజధాని కావాలన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Read ALso: Smriti Irani: ఆమె చేసిన ఏకైక నేరం.. నరేంద్ర మోడీకి జన్మనివ్వడమేనా..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!