Andhra Pradesh RGF: కర్ణాటకలో కేజీఎఫ్.. ఆంధ్రాలో ఆర్జీఎఫ్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh RGF: కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కేజీఎఫ్) గురించి అందరికీ తెలుసు. కేజీఎఫ్ సినిమాతో ఈ విషయం విశ్వమంతా తెలిసింది. అయితే ఏపీలో RGF ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆర్జీఎఫ్ అంటే రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ . నష్టాల కారణంగా రెండు దశాబ్దాల క్రితం ఆర్జీఎఫ్కు తాళం పడగా.. ఇప్పుడు మళ్లీ తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. రామగిరి బంగారు గనుల కోసం టెండర్లు మెుదలయ్యాయి. ఆగస్టు నెలాఖరులో టెండర్లు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలోని రామగిరి నార్త్ బ్లాక్, సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని 10 బ్లాక్ల బంగారు గనుల కోసం భారత ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల నుండి టెండర్లను ఆహ్వానించింది. రొద్దం మండలంలోని బొక్సంపల్లి నార్త్ ప్లాంట్, బొక్సంపల్లి సౌత్ బ్లాక్, కదిరి మండలంలోని జవకుల -ఎ, జవకుల-బి, జవకుల -సి, జవకుల-డి, జవకుల-ఒ, జవకుల-ఎఫ్ లను వేలం వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వీటిలో 5 గనులకు ఈ నెల 26న, మిగతా ఐదు గనులకు ఈనెల 29న వేలం నిర్వహించనున్నారు.
Read Also: Onion Prices Fall: ఉల్లి ధర పతనం.. అన్నదాతల కన్నీరు..
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
కాగా 2015లో మైనింగ్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఈ మేరకు ఏపీలోని 10 బంగారు గానులు, ఉత్తరప్రదేశ్లో మూడు గనులను తవ్వాలని కేంద్రం నిర్ణయించింది. బ్రిటీష్ కాలంలో రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ సంగతి బయటకు వచ్చింది. రామగిరి ఆర్పీ బ్లాక్లో 13 కి.మీ. పొడవు గల రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ (RGF) ఉన్నాయి. 1973లో రామగిరి ప్రాంతంలోని దొడ్డ బురుజు పేరుతో బంగారు నిక్షేపాలను వెలికితీసేందుకు తొలిసారి ఇక్కడ మైనింగ్ చేశారు. అప్పట్లో టన్ను మట్టిలో నుంచి 20 గ్రాముల బంగారాన్ని వెలికి తీసేవారు. 1984లో కర్నాటకలోని కోలార్ జిల్లాకు చెందిన కర్నాటక గోల్డ్ ఫీల్డ్ కంపెనీ రామగిరిలో భారత్ గోల్డ్ మైన్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఇక్కడ మైనింగ్ ప్రారంభించారు. అలా ఏడాదికి 120 కిలోల బంగారం చొప్పున 17ఏళ్ల పాటు బంగారం వెలికితీశారు. ఏప్రిల్ 2001 వరకు భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (BGML) RGFలో భూగర్భ గనిని నిర్వహించింది. అయితే గనుల రిటర్న్ల కంటే ఎక్కువ ఖర్చుల కారణంగా నష్టాలు రావడంతో మూసివేశారు. 2015లో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మళ్లీ గనుల తవ్వకాలు తెరపైకి వచ్చాయి. అయితే రామగిరి గోల్డ్ ఫీల్డ్స్లో వందల ఏళ్ల పాటు తవ్వినా తరిగిపోని బంగారు నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. తాజాగా కేంద్రం మైనింగ్కు అవకాశం ఇవ్వడంతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!