UPSC CSE 2022: సివిల్స్ 2022 ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu States Students Got Good Rank In UPSC CSE 2022: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ – 2022 తుది ఫలితాలు ఈరోజు వచ్చాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ సత్తా చాటారు. నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి మూడో ర్యాంకుతో మెరిసింది. అలాగే.. తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్ దత్తా 22 ర్యాంకుతో సత్తా చాటారు. వీరితో పాటు శాఖమూరి శ్రీసాయి హర్షిత్ 40, సాయి ప్రణవ్ 60, ఆవుల సాయికృష్ణ 94,నిధి పాయ్ (హైదరాబాద్) 110, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంత్ కుమార్ 157, కమతం మహేశ్కుమార్ 200, రావుల జయసింహారెడ్డి 217, సాహిత్య (విశాఖపట్నం) 243, అంకుర్ కుమార్ 257, బొల్లం ఉమామహేశ్వర్రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్.చేతనా రెడ్డి 346, శృతి యారగట్టి ఎస్ 362, సోనియా కటారియా 376, ఇప్పలపల్లి సుష్మిత (షాద్నగర్) 384, రేవయ్య 410, సీహెచ్ శ్రావణ్కుమార్ రెడ్డి 426, బొల్లిపల్లి వినూత్న 462, రెడ్డి భార్గవ్ 772, నాగుల కృపాకర్ 866 ర్యాంకులు సాధించారు.
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో కీలక మలుపు
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
2022 ఏడాదికి గాను యూపీఎస్సీ మొత్తం 933 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే.. ఐఏఎస్ సర్వీసులకు 180, ఐఎఫ్ఎస్కు 38, ఐపీఎస్కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు. అలాగే.. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ – ఏ కేటగిరీలో 473 మంది, గ్రూప్ బీ సర్వీసెస్లో 131 మంది ఎంపికైనట్లు తేలింది. కాగా.. సివిల్ సర్వీసెస్ పరీక్షను గతేడాది జూన్ 5వ తేదీన నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 11,35,697 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 5,73,735 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 13,090 మంది అభ్యర్థులు సెప్టెంబర్ 2022లో జరిగిన రాత పరీక్షకు అర్హత సాధించారు. వారిలో 2,529 మంది అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్కు అర్హత సాధించగా.. ఆ అభ్యర్థుల్లో నుంచి మొత్తం 933 మందిని (613 మంది పురుషులు, 320 మంది మహిళలు) వివిధ సర్వీసులకు నియామకం కోసం యూపీఎస్సీ సిఫార్సు చేసింది. మరోవైపు.. తమ పిల్లలు సివిల్స్లో ఇలా సత్తా చాటడంతో, వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?