Telugu Desam Party: ఉత్తరాంధ్రలో కొత్త వ్యూహం.. 34కి 28 చోట్ల బలంగా టీడీపీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెంటనే ఎన్నికలు వచ్చే పరిస్థితి లేకపోయినా.. నేతల పర్యటనలు, ప్రకటనలు చూస్తేంటే.. ఎన్నికలు వచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు కనిపిస్తున్నాయి.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవైపు.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరోవైపు.. ఇక, జనసేన, బీజేపీ, వామపక్షాలు.. ఇలా ఎవరి వ్యూహాల్లో వారు మునిగిపోయారు.. అయితే, ఉత్తరాంధ్రలో కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు టీడీపీ సీనియర్ నేత, ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్దా వెంకన్న… విశాఖపట్నంలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు.. ధన దాహం వున్న రాక్షసుడు జగన్… అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మండిపడ్డ ఆయన.. రానున్న ఎన్నికల్లో జగన్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఇక, ఉత్తరాంధ్రలో కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నాం.. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో 28 చోట్ల తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎవరికి అన్యాయం జరిగినా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తామని తెలిపారు బుద్దా వెంకన్న.. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు.. ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. సీఎం జగన్పై రాష్ట్రంలోని రూ.2వేల నోట్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు వెంకన్న.. అయితే, జగన్ కు ఎలాంటి ప్రణాళికలు లేకపోవడం వల్లే వరదల రూపంలో ఇలాంటి ప్రమాదం వచ్చిందని విమర్శించారు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప.. జగన్ తో ఎలా మాట్లాడాలో మంత్రులు ప్రజలకు ట్రైనింగ్ ఇస్తారా…? అని ఎద్దేవా చేశారు. విపత్తు సహాయక నిధులు అడ్డగోలుగా మళ్లించేశారని ఆరోపించారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
మరోవైపు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం సిద్దంగా వున్నామని ప్రకటించారు మాజీ మంత్రి కళా వెంకట్రావు… రైతులకు 10 బస్తాల విత్తనాలు ఇవ్వాల్సిన చోట ఒక బస్తా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నీరో చక్రవర్తి మాదిరి తాడేపల్లిలో వుంటున్నారు.. అంటూ సీఎం జగన్పై ఫైర్ అయ్యారు.. పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజలు తిరిగి తెలంగాణకు వెళ్లిపోతామనడం ప్రభుత్వానికి సిగ్గు చేటు అని మండిపడ్డారు.. అభివృద్ధి, సంక్షేమం ఏరకంగా వుందో అనడానికి ఇదే నిదర్శనంగా తెలిపారు కళా వెంకట్రావు.
తాజావార్తలు
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!