CM KCR: మరోసారి బెజవాడకు కేసీఆర్.. ఈ సారి విషయం ఇదే..!
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి విజయవాడలో పర్యటించనున్నారు.. మూడేళ్ల తర్వాత మళ్లీ విజయవాడలో అడుగుపెట్టబోతున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… గతం పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం అయ్యారు కేసీఆర్.. 2019 జూన్లో కేసీఆర్-వైఎస్ జగన్ మధ్య సమావేశం జరిగింది.. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కు సీఎం వైఎస్ జగన్ను ఆహ్వానించారు.. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు ఏపీ సీఎం.. హైదరాబాద్లోనూ రెండు రాష్ట్రాల అంశాలపైన ఇద్దరు సీఎంలు, అధికారులతో సమీక్షలు కూడా చేశారు.. అయితే, ఆ తర్వాత కొన్ని విషయాలు రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది.. జల వివాదాల్లో మాటల యుద్ధమే నడిచింది.. అయితే, మరోసారి విజయవాడ వెళ్తున్నారు కేసీఆర్.. అయితే, ఇప్పుడు ఆయన వెళ్లేదే.. సీపీఐ జాతీయ మహాసభల కోసం.
Read Also: Tankbund Shiva: త్వరలో మీ ఇంటికొస్తా.. ఆసక్తి రేపుతున్న కేటీఆర్ ట్విట్
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
విజయవాడలో అక్టోబర్ 14 నుంచి 18వ తేదీ వరకు సీపీఐ జాతీయ మహాసభలు జరగబోతున్నాయి.. ఈ మహాసభల్లో పాల్గొనాలని సీపీఐ నుంచి సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు.. ఈ విషయాన్ని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు.. ఇక, సీపీఐ జాతీయస్థాయి సమావేశాల్లో కేరళ సీఎం పినరయి విజయన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా పాల్గొనబోతున్నారు.. కేరళ, బీహార్ సీఎంలతో పాటు 20దేశాలకు చెందిన కమ్యూనిస్ట్ నేతలకు ఆహ్వానాలు అందాయి.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, ఆర్ఎస్పీ, ఫార్వార్డ్ బ్లాక్ లాంటి లెఫ్ట్ నేతలు కూడా ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. సీపీఐ జాతీయ నేతల ఆహ్వానం మేరకు బెజవాడ వెళ్లనున్నారు కేసీఆర్.. అయితే.. 14 నుంచి 18 తేదీల్లో ఆయన ఎప్పుడు వెళ్తారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే, కేరళ, బీహార్ సీఎంలు కూడా హాజరుకానున్న నేపథ్యంలో.. వారి షెడ్యూల్ ప్రకారమే కేసీఆర్ కూడా బెజవాడ వెళ్తారని.. మరోసారి నితీష్ కుమార్తో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉందని.. పనిలో పనిగా కేరళ ముఖ్యమంత్రి విజయన్తోనూ ఆయన చర్చలు జరిపే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మొత్తంగా.. మూడేళ్ల తర్వాత తెలంగాణ సీఎం.. ఏపీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
OnePlus Ace 6 Ultra: వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్
-
Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో