CM KCR: మరోసారి బెజవాడకు కేసీఆర్.. ఈ సారి విషయం ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి విజయవాడలో పర్యటించనున్నారు.. మూడేళ్ల తర్వాత మళ్లీ విజయవాడలో అడుగుపెట్టబోతున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… గతం పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం అయ్యారు కేసీఆర్.. 2019 జూన్లో కేసీఆర్-వైఎస్ జగన్ మధ్య సమావేశం జరిగింది.. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కు సీఎం వైఎస్ జగన్ను ఆహ్వానించారు.. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు ఏపీ సీఎం.. హైదరాబాద్లోనూ రెండు రాష్ట్రాల అంశాలపైన ఇద్దరు సీఎంలు, అధికారులతో సమీక్షలు కూడా చేశారు.. అయితే, ఆ తర్వాత కొన్ని విషయాలు రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది.. జల వివాదాల్లో మాటల యుద్ధమే నడిచింది.. అయితే, మరోసారి విజయవాడ వెళ్తున్నారు కేసీఆర్.. అయితే, ఇప్పుడు ఆయన వెళ్లేదే.. సీపీఐ జాతీయ మహాసభల కోసం.
Read Also: Tankbund Shiva: త్వరలో మీ ఇంటికొస్తా.. ఆసక్తి రేపుతున్న కేటీఆర్ ట్విట్
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
విజయవాడలో అక్టోబర్ 14 నుంచి 18వ తేదీ వరకు సీపీఐ జాతీయ మహాసభలు జరగబోతున్నాయి.. ఈ మహాసభల్లో పాల్గొనాలని సీపీఐ నుంచి సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు.. ఈ విషయాన్ని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు.. ఇక, సీపీఐ జాతీయస్థాయి సమావేశాల్లో కేరళ సీఎం పినరయి విజయన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా పాల్గొనబోతున్నారు.. కేరళ, బీహార్ సీఎంలతో పాటు 20దేశాలకు చెందిన కమ్యూనిస్ట్ నేతలకు ఆహ్వానాలు అందాయి.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, ఆర్ఎస్పీ, ఫార్వార్డ్ బ్లాక్ లాంటి లెఫ్ట్ నేతలు కూడా ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. సీపీఐ జాతీయ నేతల ఆహ్వానం మేరకు బెజవాడ వెళ్లనున్నారు కేసీఆర్.. అయితే.. 14 నుంచి 18 తేదీల్లో ఆయన ఎప్పుడు వెళ్తారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే, కేరళ, బీహార్ సీఎంలు కూడా హాజరుకానున్న నేపథ్యంలో.. వారి షెడ్యూల్ ప్రకారమే కేసీఆర్ కూడా బెజవాడ వెళ్తారని.. మరోసారి నితీష్ కుమార్తో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉందని.. పనిలో పనిగా కేరళ ముఖ్యమంత్రి విజయన్తోనూ ఆయన చర్చలు జరిపే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మొత్తంగా.. మూడేళ్ల తర్వాత తెలంగాణ సీఎం.. ఏపీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?