కొమ్మారెడ్డి పట్టాభి విడుదలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఇక్కడ న్యాయ వ్యవస్థ కూడా లేకపోతే జగన్ నియంతలా మారేవారు అని కామెంట్స్ చేసేవారు. కోర్టులు లేకపోతే జగన్ లో ఒక హిట్లర్ ని చూసేవాళ్లం అని తెలిపారు. ఇక వైసీపీ వారే గతంలో మమ్మల్ని అమ్మ బూతులు తిట్టింది. అధికారపార్టీ ధర్నాలు చేసే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అని తెలిపారు. ప్రశుతం ఈ ప్రభుత్వం ఫ్రస్ట్రేషన్ లో ఉంది అని బుచ్చయ్య చౌదరి అన్నారు. అయితే ఏపీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని అరెస్ట్ చేయగా ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.