Hindupuram: ఎన్టీఆర్ ఉచిత వైద్య రథాన్ని ప్రారంభించిన బాలయ్య.. వాహనం పాడవకుండా ముందుచూపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindupuram: హిందూపురం నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నడుం బిగించారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందులలో ఆయన ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను హిందూపురం వాడినే అని… మనలో మనకి అమరికలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. చలివెందులలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం శుభపరిణామం అని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా సేవలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని తాము చేపట్టామని తెలిపారు. ఇందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని బాలయ్య పిలుపునిచ్చారు.
Read Also: South Central Railway: రేపటి నుంచి పట్టాలెక్కనున్న గుంటూరు-తిరుపతి ఎక్స్ప్రెస్
Also Read
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
తొలిసారిగా మొబైల్ వాహనంలో ఈసీజీ, ఆక్సీమీటర్, అత్యాధునికమైన మైక్రోస్కోప్ వంటి పరికరాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే బాలకృష్ణ వివరించారు. ఈ వాహనం ద్వారా ప్రజలకు సుమారు 200 పరీక్షలు చేసే వెసులుబాటు ఉందన్నారు. అటు 107 రకాల మందులు ఉచితంగా సరఫరా చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజల జబ్బులు నయం అయ్యేవరకు ఈ వైద్య సేవలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
గతంలో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఎంతో అభివృద్ధి చేశామని.. ప్రస్తుతం ఆసుపత్రిలో 20 ఇంక్యూబేటర్లు నిరుపయోగంగా ఉన్నాయని బాలయ్య గుర్తుచేశారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలని.. మనుషులను మనుషులుగా గుర్తించాలని.. అది సంస్కారం అని హితవు పలికారు. అందుకే టీడీపీ పుట్టిందన్నారు. ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో భవిష్యత్లో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని బాలయ్య వెల్లడించారు. అందరూ ఎన్టీఆర్ వైద్యరథాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాహనానికి ఎవరైనా అపకారం చేసే ప్రమాదం ఉందని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని బాలయ్య తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు సహకారంతో హిందూపురంను ఆరోగ్యపురంగా చేస్తామన్నారు. చంద్రబాబు సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరిస్తామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
-
India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
-
Guru Purnima 2026: గురు పౌర్ణమి జూలై 28నా? 29నా? సరైన తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!