Kuna Ravi: తమ్మినేని కామెంట్లపై కూన రవి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. అందునా శ్రీకాకుళం జిల్లాలో బంధువుల మధ్యే రాజకీయ వైరం ముదురుతోంది. టీడీపీ నేత కూనరవి- స్పీకర్ తమ్మినేని మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. టీడీపీపై స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కూన రవి. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే రకం తమ్మినేని. తమ్మినేనిని ఆముదాల వలసలో సజీవంగా దహనం చేస్తారు.
తమ్మినేని పాడె మోయడానికి కూడా ఎవరు ఉండరని ఘాటైన విమర్శలు చేశారు కూన రవి. టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయన్న వారికే రోజులు దగ్గరపడ్డాయి. ఒకరిద్దరికి మంత్రి పదవులిచ్చినంత మాత్రాన ఒరిగేదేం లేదు. వైసీపీని పడగొట్టడానికి రెడీగా ఉన్నారు. తన చితికి తానే వైసీపీ నిప్పు పెట్టుకుంటోందన్నారు కూన రవి. వైసీపీ సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్రలో భాగంగా స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సంతృప్తికర పాలన కొనసాగుతోందన్నారు. మళ్లీ సీఎం జగన్ను గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని అన్నారు.
Also Read
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపైన విమర్శలు చేశారు తమ్మినేని. రాష్ట్రంలో సామాజిక న్యాయం చేస్తుంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు అల్లర్లకు పాల్పడుతున్నాయంటూ మండిపడ్డారు. మహానాడు కాదు వల్లకాడు అంటూ తమ్మినేని నిప్పులు చెరిగారు. అమలాపురంలో దళిత మంత్రి ఇంటికి నిప్పు పెట్టడం అమానుషమన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని సమర్ధిస్తారా లేదా ప్రతిపక్ష పార్టీలు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసారు.
రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని, రాబోయే ఎన్నికలనాటికి టీడీపీ కనిపించకుండా పోతుందని తమ్మినేని పేర్కొన్నారు. చచ్చిన పార్టీకి ప్రజలు దహన సంస్కారాలు చేస్తున్నారని.. జగన్మోహన రథచక్రాల కింద విపక్షాలు నలిగిపోతున్నాయని తమ్మినేని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బలహీన వర్గాలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని..స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలపై కూన రవి, వర్ల రామయ్య తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్కు మతిభ్రమించిందని.. అందుకే మహానాడును వల్లకాడుతో పోలుస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. పసుపు కండువా కప్పుకొనే చస్తానని ప్రగల్బాలు పలికి.. నయ వంచకుడి పక్కన చేరి పిచ్చిగా మాట్లాడడం సరికాదని వర్ల రామయ్య హితవు పలికారు.
తాజావార్తలు
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!