రాష్ట్రంలో మహిళలు, విద్యార్ధినులపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న తీరుపై సీఎం జగన్ కి లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు.రాష్ట్రంలో గంజాయి, డ్రగ్, మద్యం అమ్మకాల వల్లే రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోంది.
దేశంలో ఏమూలన గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయి. దీని వల్ల రాష్ట్ర యువత భవిష్యత్ తో పాటు రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూ. 9,251 కోట్ల విలువైన 2 లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కాల్చివేశామని పోలీసులు చెబుతున్నారు.
కేవలం దొరికిన గంజాయి ఇన్ని లక్షల్లో ఉంటే ఇక దొరకని గంజాయి ఎన్ని లక్షల కిలోల్లో ఉంటుంది? గతంలో విశాఖ మన్యంలో కేవలం వందల ఎకరాల్లో జరిగే గంజాయి సాగు వైసీపీ పాలనలో 15 వేల ఎకరాలకు విస్తరించింది.వైసీపీ నేతలు అక్రమ సంపాద కోసం మన్యంలో గంజాయిని వాణిజ్య పంటగా మార్చుకుని అమాయకులైన గిరిజనుల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. చివరకు ఆన్ లైన్ లో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో పరిస్థితి ఏవిధంగా ఉందో తేటతెల్లమవుతోందని లేఖలో వివరించారు నక్కా ఆనందబాబు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్, మద్యం అమ్మకాలు, రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలపై సీఎం జగన్ కి లేఖ రాసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, మద్యం అమ్మకాలు, రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలపై సీఎం జగన్ కి లేఖ రాసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు.