Mandra Sivananda Reddy: లోకేష్ను కలవడానికి బైరెడ్డి ఎంతో మంది కాళ్లు పట్టుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ్రెడ్డిపై నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జి మాండ్ర శివానందరెడ్డి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నందికొట్కూరు నియెజకవర్గం ఎక్కడ అభివృద్ధి చెందిందో చెప్పాలని వైసీపీ నాయకులు చెప్పాలని మాండ్ర శివానందరెడ్డి డిమాండ్ చేశారు. రియల్టర్ల దగ్గర కమిషన్లు తీసుకోవడం తప్ప జరిగిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. నందికొట్కూరులో వైసీపీ రాక్షస పాలన సాగుతోందని.. డాక్టర్పై దాడి ఘటనే అందుకు ఉదాహరణ అని మాండ్ర శివానందరెడ్డి విమర్శలు చేశారు.
టీడీపీలో చేరాలని ఎవరెవరి కాళ్లు పట్టుకుని నారా లోకేష్ను కలిశారో అందరికీ తెలుసు అని మాండ్ర శివానందరెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఆర్థర్ను గెలిపించింది పార్టీ కానీ వ్యక్తి కాదన్నారు. వైసీపీ ఇంఛార్జ్ వాపు చూసుకుని బలుపు అనుకుంటున్నారని.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి సొంత పార్టీ పెట్టి విఫలమైన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. కాగా ఇటీవల తాను టీడీపీ చేరతానని వస్తున్న వార్తలను బైరెడ్డి సిద్ధార్ధ్రెడ్డి ఖండించిన సంగతి తెలిసిందే. నందికొట్కూరు అభివృద్ధి కోసం రూ.16 కోట్లు మంజూరు చేయించానని.. తాను నారా లోకేష్ను కలిసినట్లు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు ఆధారాలు చూపించాలని బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి సవాల్ విసిరిన సంగతి విదితమే.
Also Read
Tirupati: రుయా ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఆర్ఎంవోపై వేటు
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..