AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెక్షన్ 22-Aపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ప్రభుత్వ, దేవాదాయ, అసైన్డ్, సీలింగ్ మిగులు భూములు అన్యాక్రాంతం కాకుండా 22-Aను రూపొందించామని, 2007లో తీసుకొచ్చిన ఈ విధానంలో సమూల మార్పులు చేస్తూ పాత సర్క్యులర్లను రద్దు చేస్తున్నామని తెలిపారు. ఈ కొత్త నిర్ణయంతో భూములను 22-A జాబితా నుంచి తొలగించే ప్రక్రియ సులభతరం కానుంది. అదే సమయంలో.. కొత్త భూములను ఈ జాబితాలో చేర్చాలంటే మాత్రం అత్యంత కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
ఇకపై మ్యాన్యువల్ ఎంట్రీలను పూర్తిగా నిషేధిస్తూ, ప్రతి వారం వెబ్ల్యాండ్ 2.0 డేటాను ఐజీఆర్ఎస్ (IGRS) డేటాబేస్తో సింక్రనైజ్ చేస్తారు. నిషేధిత ఆస్తుల వివరాలన్నింటినీ ఓపెన్ డొమైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. గ్రామకంఠం, పట్టా భూములు, విలేజ్ సర్వీస్ ఇనాం భూములను అనవసరంగా 22-Aలో చేర్చితే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. అలాగే చట్టబద్ధంగా క్రమబద్ధీకరించిన ULC భూములు, APSFC వేలంలో కొనుగోలు చేసిన భూములను అర్హత మేరకు 22-A నుంచి తొలగిస్తారు. కోర్టు ఉత్తర్వులు వచ్చిన ఐదు రోజుల్లోనే సబ్ రిజిస్ట్రార్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
ముఖ్యంగా.. ఏదైనా భూమిని 22-Aలో చేర్చే ప్రక్రియను క్వాసి జ్యుడీషియల్ ప్రక్రియగా పరిగణిస్తారు. భూమిని చేర్చే ముందు యజమానికి నోటీసు ఇచ్చి, విచారణ జరిపిన తర్వాతే స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి. భూమి ప్రభుత్వానిదని నిరూపించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుంది తప్ప భూ యజమానులపై కాదు. 22-A జాబితాలో భూమిని చేర్చడం లేదా తొలగించే అధికారం ఆర్డీవో (RDO) లేదా సబ్ కలెక్టర్కు ఉంటుంది. వీరి నిర్ణయంపై జాయింట్ కలెక్టర్ అప్పీలేట్ అథారిటీగా వ్యవహరిస్తారు.
నూతన సాఫ్ట్వేర్ వ్యవస్థను 90 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని, అయితే కొత్త జీవో నిబంధనలు మాత్రం తక్షణమే అమల్లోకి వస్తాయని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో గతంలో రీసర్వే జరిగిన 6,688 గ్రామాల్లో తప్పులను సరిదిద్దుతూ, త్వరలోనే మరో 4 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తి చేస్తామన్నారు. రైతులు, పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ వ్యవస్థలో పారదర్శక సంస్కరణలు తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
-
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
-
Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
-
SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
-
Yash : యష్ రిస్క్ చేస్తున్నాడా? బయట పడలేకపోతున్నాడా?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!