Ram Mohan Naidu: బీసీలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంది..
- బీసీల బలం పెరగడానికి ముఖ్య కారకుడు యుగపురుషుడు ఎన్టీఆర్..
- బీసీలను పార్లమెంట్ మెట్లు ఎక్కించిన ఘనత టీడీపీది..
- బీసీలు విదేశాల్లో ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారంటే చంద్రబాబు కృషి: రామ్మోహన్ నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mohan Naidu: ఏపీ రాజకీయాల్లో బాహుబలి మా బాబాయ్ అచ్చెం నాయుడు అని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతి నాయకుడు బీసీల గళం సమాజానికి వినిపించాలి.. సన్మానాలు కాదు.. మన బలాన్ని ఐకమత్యతను సమాజానికి చూపించాలి.. బీసీల బలం పెరగటానికి ముఖ్య కారకుడు యుగపురుషుడు ఎన్టీఆర్ అని ఆయన పేర్కొన్నారు. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకువచ్చే బాధ్యత టిడిపి తీసుకుంది.. బీసీలు పంచాయతీ మెట్ల ఎక్కాలంటేనే అనేక అవమానాలు పడేవాళ్లు.. అలాంటి బీసీలను పార్లమెంట్ మెట్లు ఎక్కించిన ఘనత టీడీపీది.. బీసీలకు నూతన పథకాలు ప్రారంభమయ్యాయంటే.. అది టీడీపీ ప్రభుత్వంలోనే.. బీసీలకు రిజర్వేషన్లు పెట్టిన ఘనత చంద్రబాబుది.. దావోస్, అమెరికాలాంటి దేశాల్లో కూడా బీసీలు ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారంటే చంద్రబాబు చేసిన కృషి కారణం అని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.
Read Also: East Central Railway Recruitment 2025: రైల్వేలో 1,154 పోస్టులు.. పరీక్ష లేకుండానే జాబ్ పొందే ఛాన్స్
Also Read
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ఇకపై ఉద్యోగాలు చేయటం కాదు.. మనమే కంపెనీలు పెట్టాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. కులవృత్తులతో ఆగిపోకూడదు.. కులవృత్తుల్లో ఆధునిక విధానాలను స్ఫూర్తిగా తీసుకొని ఆర్థికంగా ఎదగాలి.. బీసీ సోదరులను సామాజికంగా అభివృద్ధి చేసేందుకు ఏ సాయం కావాలన్నా బీసీ నాయకులు ముందుంటారు.. మన లక్ష్యాల సాధనకు కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. ప్రపంచాన్ని ఏలే తరంగా బీసీలు నిలబడాలి.. బీసీలు కదం తొక్కడం వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. రికార్డు బ్రేకింగ్ మెజార్టీలు ఇచ్చారు.. 2019 -24 మధ్యలో బీసీలు దగాపడ్డారు.. జగన్, బీసీలను మంత్రులుగా చేశారు కానీ పవర్ మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. కానీ, చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారు.. ఎర్రం నాయుడు కుటుంబంపై ప్రత్యేక అభిమానం చూపించారు.. నాలాంటి జూనియర్ కి కూడా కేంద్ర మంత్రి పదవిని ఇప్పించారు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
తాజావార్తలు
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
-
Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!