Ram Mohan Naidu: బీసీలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంది..
- బీసీల బలం పెరగడానికి ముఖ్య కారకుడు యుగపురుషుడు ఎన్టీఆర్..
- బీసీలను పార్లమెంట్ మెట్లు ఎక్కించిన ఘనత టీడీపీది..
- బీసీలు విదేశాల్లో ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారంటే చంద్రబాబు కృషి: రామ్మోహన్ నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mohan Naidu: ఏపీ రాజకీయాల్లో బాహుబలి మా బాబాయ్ అచ్చెం నాయుడు అని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతి నాయకుడు బీసీల గళం సమాజానికి వినిపించాలి.. సన్మానాలు కాదు.. మన బలాన్ని ఐకమత్యతను సమాజానికి చూపించాలి.. బీసీల బలం పెరగటానికి ముఖ్య కారకుడు యుగపురుషుడు ఎన్టీఆర్ అని ఆయన పేర్కొన్నారు. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకువచ్చే బాధ్యత టిడిపి తీసుకుంది.. బీసీలు పంచాయతీ మెట్ల ఎక్కాలంటేనే అనేక అవమానాలు పడేవాళ్లు.. అలాంటి బీసీలను పార్లమెంట్ మెట్లు ఎక్కించిన ఘనత టీడీపీది.. బీసీలకు నూతన పథకాలు ప్రారంభమయ్యాయంటే.. అది టీడీపీ ప్రభుత్వంలోనే.. బీసీలకు రిజర్వేషన్లు పెట్టిన ఘనత చంద్రబాబుది.. దావోస్, అమెరికాలాంటి దేశాల్లో కూడా బీసీలు ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారంటే చంద్రబాబు చేసిన కృషి కారణం అని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.
Read Also: East Central Railway Recruitment 2025: రైల్వేలో 1,154 పోస్టులు.. పరీక్ష లేకుండానే జాబ్ పొందే ఛాన్స్
Also Read
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
ఇకపై ఉద్యోగాలు చేయటం కాదు.. మనమే కంపెనీలు పెట్టాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. కులవృత్తులతో ఆగిపోకూడదు.. కులవృత్తుల్లో ఆధునిక విధానాలను స్ఫూర్తిగా తీసుకొని ఆర్థికంగా ఎదగాలి.. బీసీ సోదరులను సామాజికంగా అభివృద్ధి చేసేందుకు ఏ సాయం కావాలన్నా బీసీ నాయకులు ముందుంటారు.. మన లక్ష్యాల సాధనకు కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. ప్రపంచాన్ని ఏలే తరంగా బీసీలు నిలబడాలి.. బీసీలు కదం తొక్కడం వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. రికార్డు బ్రేకింగ్ మెజార్టీలు ఇచ్చారు.. 2019 -24 మధ్యలో బీసీలు దగాపడ్డారు.. జగన్, బీసీలను మంత్రులుగా చేశారు కానీ పవర్ మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. కానీ, చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారు.. ఎర్రం నాయుడు కుటుంబంపై ప్రత్యేక అభిమానం చూపించారు.. నాలాంటి జూనియర్ కి కూడా కేంద్ర మంత్రి పదవిని ఇప్పించారు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
తాజావార్తలు
-
AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం…
-
Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
-
Bathroom Cleaning Tips: కుళాయిలు, సింక్లు కొత్తవిగా మెరవాలంటే.. ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్త మెరుపు!
-
Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
-
December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!