Ram Mohan Naidu: బీసీలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంది..
- బీసీల బలం పెరగడానికి ముఖ్య కారకుడు యుగపురుషుడు ఎన్టీఆర్..
- బీసీలను పార్లమెంట్ మెట్లు ఎక్కించిన ఘనత టీడీపీది..
- బీసీలు విదేశాల్లో ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారంటే చంద్రబాబు కృషి: రామ్మోహన్ నాయుడు
Ram Mohan Naidu: ఏపీ రాజకీయాల్లో బాహుబలి మా బాబాయ్ అచ్చెం నాయుడు అని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతి నాయకుడు బీసీల గళం సమాజానికి వినిపించాలి.. సన్మానాలు కాదు.. మన బలాన్ని ఐకమత్యతను సమాజానికి చూపించాలి.. బీసీల బలం పెరగటానికి ముఖ్య కారకుడు యుగపురుషుడు ఎన్టీఆర్ అని ఆయన పేర్కొన్నారు. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకువచ్చే బాధ్యత టిడిపి తీసుకుంది.. బీసీలు పంచాయతీ మెట్ల ఎక్కాలంటేనే అనేక అవమానాలు పడేవాళ్లు.. అలాంటి బీసీలను పార్లమెంట్ మెట్లు ఎక్కించిన ఘనత టీడీపీది.. బీసీలకు నూతన పథకాలు ప్రారంభమయ్యాయంటే.. అది టీడీపీ ప్రభుత్వంలోనే.. బీసీలకు రిజర్వేషన్లు పెట్టిన ఘనత చంద్రబాబుది.. దావోస్, అమెరికాలాంటి దేశాల్లో కూడా బీసీలు ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారంటే చంద్రబాబు చేసిన కృషి కారణం అని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.
Read Also: East Central Railway Recruitment 2025: రైల్వేలో 1,154 పోస్టులు.. పరీక్ష లేకుండానే జాబ్ పొందే ఛాన్స్
Also Read
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- AP SSC Results 2026: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
ఇకపై ఉద్యోగాలు చేయటం కాదు.. మనమే కంపెనీలు పెట్టాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. కులవృత్తులతో ఆగిపోకూడదు.. కులవృత్తుల్లో ఆధునిక విధానాలను స్ఫూర్తిగా తీసుకొని ఆర్థికంగా ఎదగాలి.. బీసీ సోదరులను సామాజికంగా అభివృద్ధి చేసేందుకు ఏ సాయం కావాలన్నా బీసీ నాయకులు ముందుంటారు.. మన లక్ష్యాల సాధనకు కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. ప్రపంచాన్ని ఏలే తరంగా బీసీలు నిలబడాలి.. బీసీలు కదం తొక్కడం వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. రికార్డు బ్రేకింగ్ మెజార్టీలు ఇచ్చారు.. 2019 -24 మధ్యలో బీసీలు దగాపడ్డారు.. జగన్, బీసీలను మంత్రులుగా చేశారు కానీ పవర్ మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. కానీ, చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారు.. ఎర్రం నాయుడు కుటుంబంపై ప్రత్యేక అభిమానం చూపించారు.. నాలాంటి జూనియర్ కి కూడా కేంద్ర మంత్రి పదవిని ఇప్పించారు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
తాజావార్తలు
-
SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ ‘నో-లుక్’ షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య వివాహం
-
Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
-
Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
-
Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?