Jai Jawan: వీరుడా నీకు వందనం… వీర జవాన్కి వీడ్కోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీరుడా వందనం అంటూ అమర వీరునికి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తామరలో తుది వీడ్కోలు పలికారు. జాతీయ జెండాతో ఐదు కిలోమీటర్ల బైక్ ర్యాలీ చేసి అంతిమ వీడ్కోలు పలికారు. గత నెల 24న ఝార్ఖండ్ లో దురదృష్టవశాత్తు హెచ్ ఎఫ్ ఎస్ ఎల్ గ్రైనైడ్ పేలి పాతపట్నం మండలం తామర గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాను పడాల యోగేశ్వరరావు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే జూన్ 15 రాత్రి ఆయన రాంచీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. యోగేశ్వరరావు (లవ కుమార్) 2017 లో సీఆర్పిఎఫ్ లో చేరారు. తర్వాత కాలంలో నక్సలైట్ల అణిచివేతకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోబ్రా 313 బ్యాచ్ లో చేరారు. సెలవుపై గత నెల 7వ తారీకున స్వగ్రామమైన తామర కు వచ్చిన యోగేశ్వరరావు గత నెల 22న తిరిగి విధుల్లో చేరేందుకు వెళ్ళారు.
మే 24న విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు హెచ్ ఎఫ్ ఎస్ ఎల్ గ్రైనైడ్ బాంబు కిందపడి పేలి యోగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో రాంచి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం యోగేశ్వరరావు ను తరలించారు. అప్పటికే ఆయన కుడిచేయి బాంబు పేలుడు ధాటికి ఛిద్రమవడంతో కుడిచేతిని తొలగించి చికిత్స అందించారు. ఇరవై మూడు రోజులు మృత్యువుతో పోరాడిన యోగేశ్వరరావు ఈనెల 15 రాత్రి తుదిశ్వాస విడిచాడు. అక్కడ గౌరవవందనం సమర్పించిన తర్వాత అక్కడినుంచి శుక్రవారం ఆయన స్వగ్రామానికి భౌతికకాయాన్ని సిఆర్పీఎఫ్ అధికారులు తరలించారు.
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి

జవాన్ కి గౌరవ వందనం
యోగేశ్వరరావు భౌతికకాయం నవతల కూడలి వద్దకు చేరుకోగానే అంతకుముందే జాతీయ జెండాలతో ఉన్న సుమారు 500 మంది యువకులు నవతల కూడలి నుంచి తామర గ్రామం వరకు జాతీయ జెండా చేత పట్టుకొని బైక్ పై ర్యాలీగా వెళ్తూ యోగేశ్వరరావు అమర్ రహే, భారత్ మాతాకీ జై , అఖండ భారతం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. యోగేశ్వరరావు భౌతికకాయాన్ని తామర గ్రామానికి తరలించారు. అనంతరం అధికారిక లాంఛనాలతో యోగేశ్వరరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. యోగేశ్వరరావు తల్లిదండ్రులు పడాల తిరుపతిరావు, వెంకటమ్మ. వీరికి నలుగురు కుమారులు కాగా అందులో పెద్దవాడు ప్రతాప్ ఆర్మీలో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. రెండో కుమారుడు కిరణ్ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. యోగేశ్వరరావు, ఈశ్వరరావు వీరిరువురు కవల పిల్లలు. వీరిద్దరూ సిఆర్పీఎఫ్ లోనే విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరినీ గ్రామంలో కవల పిల్లలు కావడంతో లవ కుశ లుగా పిలుస్తారు. యోగేశ్వరరావు వీర మరణంతో తామర గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తమ గ్రామానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు శుక్రవారం అంత్యక్రియల్లో పాల్గొని యోగేశ్వరరావుకు కడసారి నివాళులు అర్పించారు.
తాజావార్తలు
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?