Swimming Tragedy: ప్రాణాలు తీస్తున్న ఈత సరదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరదా కోసం విహారయాత్రలకు వెళ్లే యువతీయువకులు ఈత కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంచుమించు గత కొంతకాలంగా ఈ తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకి చెందిన ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ఈత సరదాతో పెన్నానదిలో గల్లంతయ్యాడు. పేరారెడ్డిపల్లెకి చెందిన అన్నం లోకేష్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతని స్నేహితులు బాలాజీ, రమణయ్య, లోకేష్ ఫ్రెండ్స్. వీరంతా పెన్నానదిలో సరదాగా ఈతకోసం వెళ్లారు. వీరంతా నీటి ఉధృతిలో చిక్కుకున్నారు. స్థానికులు వెంకటరమణయ్య, బాలాజీలను కాపాడారు. లోకేష్ మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గాలింపు అనంతరం లోకేష్ డెడ్ బాడీ లభించింది. చేతికి అంది వచ్చిన కొడుకు తిరిగి రాని లోకాలకు పోవడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.
ఇటు గుంటూరు జిల్లా, తెనాలి మండలంలో ఓ ఉద్యోగి నీటిలో గల్లంతయ్యాడు. దేవుని దర్శనం కోసం వచ్చి స్నానం కోసం దిగిన ప్రైవేటు ఉద్యోగి నదీ ప్రవాహానికి గల్లంతైన ఘటన శనివారం తెనాలి మండలం సంఘం జాగర్లమూడిలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవీంద్ర సింగ్ తెనాలిలో మీటింగ్ నిమిత్తం శుక్రవారం రాత్రి రాగా శనివారం ఉదయం జాగర్లమూడి లోని సంగమేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వెళ్లి నేపథ్యంలో స్నానం చేయబోయాడు.
Also Read
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక విధాన నిర్ణయాలపై ఫోకస్..
- YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
- CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
Read Also: Gujarat: రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులో ఉపాధ్యాయులు, ఉద్యోగులు
ఈ తరుణంలో నదీ ప్రవాహానికి బలయ్యారు. కంపెనీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం నరసరావుపేటకు చెందిన రవీంద్ర సింగ్ కంపెనీలో ఉన్నత స్థితిలో ఉన్నారని కాలువలో స్నానానికి వెళ్లి గల్లంతు కావడం దురదృష్టకరమన్నారు. ఈత వచ్చిన అతను ప్రవాహాన్ని అడ్డుగోలేకపోయారని పేర్కొన్నారు. అతనికి భార్య, కుమార్తె ,కుమారుడు ఉన్నారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ,కంపెనీ అధికారులకు ఘటన గురించి తెలియజేయడం జరిగిందని వివరించారు.
Read Also: KRJ Bharath: ఏపీ శాసనమండలి ఛైర్మన్గా కుప్పం వైసీపీ నేత.. ఫోటో వైరల్..!!
తాజావార్తలు
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
-
Vijay Antony: సీఎం విజయ్ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్గా మారిన ఫోటోలు!
-
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్కు కాటేరమ్మ కొడుకు దూరం..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!