ఆ విషయంలో డాలర్ శేషాద్రి అదృష్టవంతుడు: స్వరూపానందేంద్ర స్వామి
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో ఆయనకు పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మృతిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. డాలర్ శేషాద్రితో శారదా పీఠానికి సుదీర్ఘకాలం అనుభవం ఉంటుందన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించిన ప్రతి ఒక్కరికీ డాలర్ శేషాద్రి సుపరిచితులు అని స్వరూపానందేంద్ర అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది డాలర్ శేషాద్రి ఆప్యాయతను పొందారని.. ఆయన హఠాన్మరణం తన హృదయాన్ని కలచివేసిందని తెలిపారు. నిత్యం వెంకటేశ్వరస్వామి పాదాల చెంత జీవించారని.. ఈ విషయంలో డాలర్ శేషాద్రి అదృష్టవంతుడు అని అభిప్రాయపడ్డారు. ఆయన ఆత్మ శాంతించాలని.. ఆయన సాక్షాత్తూ మహావిష్ణువు హృదయంలోకి చేరాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also: శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం
Also Read
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
మరోవైపు డాలర్ శేషాద్రి మరణంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం ప్రకటించారు. శేషాద్రి మరణవార్త తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. శేషాద్రి జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవి అన్నారు. 1978 నుంచి శ్రీవారి సేవలో తరిస్తున్న శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటు అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు డాలర్ శేషాద్రి పెద్ద దిక్కుగా పనిచేశారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
అటు శేషాద్రి మరణంపై టీటీడీ మాజీ జేఈవో శ్రీనివాసరాజు కూడా స్పందించారు. తనకు డాలర్ శేషాద్రి ప్రాణ సమానుడు అని… ఆయన లక్షలాది మంది శ్రీవారి భక్తులకు ప్రీతిపాత్రుడు అని తెలిపారు. శేషాద్రి సేవలు టీటీడీకి ఎప్పటికీ గుర్తుండిపోతాయని.. 50 ఏళ్లుగా స్వామివారికి సేవలు అందించిన మహనీయుడు అని కొనియాడారు. శేషాద్రికి ముందు…శేషాద్రి తరువాత అన్నట్లు టీటీడీలో చరిత్ర లిఖించబడుతుందన్నారు. శేషాద్రి మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని శ్రీనివాసరాజు వ్యాఖ్యానించారు. చివరి నిమిషం వరకు స్వామి సేవలోనే తరిస్తూనే పరమపదించాలన్న తన కోరికను శేషాద్రి నెరవేర్చుకున్నారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!