పీఆర్సీ బ్రహ్మ పదార్థంగా మారింది: సూర్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల మధ్య పీఆర్సీకి సంబంధించి చర్చలు జరుగుతునే ఉన్నాయి. పీఆర్సీ విషయంలో అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు పొత్తు కుదరడం లేదు. దీంతో ఈ అంశం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. తాజాగా జరిగిన చర్చల అంశాలను ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాకు వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర విభజన నుంచి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి వరకు అధికారులు మాకు వివరించారన్నారు. ఇక ముందు చర్చలకు రావాలంటే కొన్ని ఫ్రీ కండిషన్స్ ఉంటాయని చెప్పామన్నారు. పీఆర్సీ నివేదిక ఇస్తారా ఇవ్వరా అనేది స్పష్టం చేయాలని కోరామన్నారు. పీఆర్సీ ఒక బ్రహ్మపదార్థంగా మారిందని విమర్శించారు. పోస్ట్ డేటెడ్ చెక్ లాగా డీఏలు, అరియర్స్ ఎప్పుడో ఇస్తామనటం సమంజసం కాదన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు 16నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. దీనికి పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సిగ్గు పడాలన్నారు.
Read Also:వంగవీటిపై రెక్కీ నిర్వహించడం బాధాకరం: కళా వెంకట్రావు
Also Read
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇస్తున్నాం అని ప్రభుత్వం నివేదిక ఇవ్వగలదా? జీతాలే ఇవ్వకుండా జీతాల స్థిరీకరణ చేస్తాం అంటే ఎలా నమ్మగలం? కాలక్షేపపు చర్చలకు మమ్మల్ని ఆహ్వానించ వద్దని చెప్పామని సూర్యనారాయణ వెల్లడించారు. జనవరి నుంచి అన్ని జిల్లాల్లో తాలూకా స్థాయి వరకు ఉద్యోగుల చైతన్య యాత్రలు చేపడుతున్నాం. 50 మంది నాయకులు పర్యటిస్తాం.రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు, పీఆర్సీ పేరుతో జరుగుతున్న ప్రహసనాన్ని, అధికారుల నిర్లిప్త వైఖరిని ఉద్యోగుల్లో కి తీసుకుని వెళ్లి ఎండగడతామన్నారు. ముఖ్యమంత్రి ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించాలి.ఐఏఎస్ అధికారులు తమ శాఖాపరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తరుచు విఫలమవుతున్నారు. వారే విఫలం అవుతున్నారా లేక ప్రభుత్వం నియంత్రిస్తున్నారా? అనేది అర్ధం కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు ఆత్మగౌరవం లేదు. దీర్ఘకాలిక పోరాటానికి శ్రీకారం చుడుతున్నాం
113 అంశాల పై అధ్యయనం చేశామని దీనిపై ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడుతామని సూర్యనారాయణ తెలిపారు.
తాజావార్తలు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
-
Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!