పీఆర్సీ బ్రహ్మ పదార్థంగా మారింది: సూర్యనారాయణ
గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల మధ్య పీఆర్సీకి సంబంధించి చర్చలు జరుగుతునే ఉన్నాయి. పీఆర్సీ విషయంలో అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు పొత్తు కుదరడం లేదు. దీంతో ఈ అంశం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. తాజాగా జరిగిన చర్చల అంశాలను ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాకు వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర విభజన నుంచి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి వరకు అధికారులు మాకు వివరించారన్నారు. ఇక ముందు చర్చలకు రావాలంటే కొన్ని ఫ్రీ కండిషన్స్ ఉంటాయని చెప్పామన్నారు. పీఆర్సీ నివేదిక ఇస్తారా ఇవ్వరా అనేది స్పష్టం చేయాలని కోరామన్నారు. పీఆర్సీ ఒక బ్రహ్మపదార్థంగా మారిందని విమర్శించారు. పోస్ట్ డేటెడ్ చెక్ లాగా డీఏలు, అరియర్స్ ఎప్పుడో ఇస్తామనటం సమంజసం కాదన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు 16నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. దీనికి పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సిగ్గు పడాలన్నారు.
Read Also:వంగవీటిపై రెక్కీ నిర్వహించడం బాధాకరం: కళా వెంకట్రావు
Also Read
- AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
- Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇస్తున్నాం అని ప్రభుత్వం నివేదిక ఇవ్వగలదా? జీతాలే ఇవ్వకుండా జీతాల స్థిరీకరణ చేస్తాం అంటే ఎలా నమ్మగలం? కాలక్షేపపు చర్చలకు మమ్మల్ని ఆహ్వానించ వద్దని చెప్పామని సూర్యనారాయణ వెల్లడించారు. జనవరి నుంచి అన్ని జిల్లాల్లో తాలూకా స్థాయి వరకు ఉద్యోగుల చైతన్య యాత్రలు చేపడుతున్నాం. 50 మంది నాయకులు పర్యటిస్తాం.రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు, పీఆర్సీ పేరుతో జరుగుతున్న ప్రహసనాన్ని, అధికారుల నిర్లిప్త వైఖరిని ఉద్యోగుల్లో కి తీసుకుని వెళ్లి ఎండగడతామన్నారు. ముఖ్యమంత్రి ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించాలి.ఐఏఎస్ అధికారులు తమ శాఖాపరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తరుచు విఫలమవుతున్నారు. వారే విఫలం అవుతున్నారా లేక ప్రభుత్వం నియంత్రిస్తున్నారా? అనేది అర్ధం కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు ఆత్మగౌరవం లేదు. దీర్ఘకాలిక పోరాటానికి శ్రీకారం చుడుతున్నాం
113 అంశాల పై అధ్యయనం చేశామని దీనిపై ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడుతామని సూర్యనారాయణ తెలిపారు.
తాజావార్తలు
-
Riyan Parag: మీకు అవసరం లేదు.. వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
-
RR vs DC: జస్ట్ మిస్! బ్యాట్తో కుల్దీప్ ముఖం పగులగొట్టబోయిన జడేజా.. ఒక్క క్షణం అంతా గందరగోళం!(వీడియో)
-
Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
-
EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!