NTV Telugu Site icon

Rishikonda: రిషికొండలో నిర్మాణాలకు సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్నల్

Ngtsupre

Ngtsupre

విశాఖ పట్నంలోని రిషికొండలో టూరిజం భవనాల నిర్మాణాలపై ఎన్జీటీ విధించిన స్టే ఎత్తివేయాలని..ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రిషికొండలో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. అక్కడ చదును చేసే ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది.

ఇప్పటికే నిర్మాణాలున్న ప్రాంతంలో యథావిథిగా నిర్మాణాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. రుషికొండ ప్రాజెక్ట్ కేసు విచారణ హైకోర్టుకు బదిలీ చేసింది. ట్రిబ్యునల్ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని తేల్చింది సుప్రీం కోర్టు. హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్జీటీ బేఖాతరు చేయడం తగదని హితవు పలికింది.

హైకోర్టు రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టీకరించింది. హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అప్పటి వరకు ఎన్జీటీలో విచారణ జరపరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.

ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ ఆధారంగా ప్రాజెక్టు పనులను నిలిపివేస్తూ ఎన్జీటీ స్టే ఇవ్వడాన్ని తప్పుబడుతూ ఏపీ ప్రభుత్వం పిల్ వేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులను చేరుకోలేని వారు రాసే లేఖలను మాత్రమే పిటిషన్లుగా పరిగణించాలంటూ హితవు పలికింది.ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ సింఘ్వి వాదనలు వినిపించారు.

ఈ ప్రాజెక్టుతో 300 మందికి ఉపాధి దొరుకుతుందని, రూ.180 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఓ ఎంపీ రాసిన లేఖ ఆధారంగా ఎన్జీటీ స్టే ఉత్తర్వులు జారీ చేసిందని తెలపగా.. సుప్రీంకోర్టు ఎన్జీటీ తీరు సరికాదని హితవు పలికింది. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ కేసులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు రిషికొండ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ మంజూరు చేసింది.

Supreme Court: రిషికొండ టూరిజం ప్రాజెక్టుపై విచారణ రేపటికి వాయిదా