Bail For Mlc Ananthababu: అనంతబాబుకి బెయిల్.. సుప్రీంకోర్టులో రిలీఫ్
ఎమ్మెల్సీ అనంతబాబుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. అనంతబాబు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతులు ట్రయల్ కోర్టు నిర్దేశిస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజమండ్రిలోని ఎస్సి, ఎస్టీ కోర్టు, ఏపీ హైకోర్టు (High Court) అనంతబాబు (MLC Ananthababu) బెయిల్ పిటీషన్ కొట్టేశాయి.
Read Also: Tollywood Box Office: సినిమాలు ఫుల్… కలెక్షన్లు నిల్…
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
దీనితో అనంతబాబు కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డిఫాల్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును అనంతబాబు ఆశ్రయించారు. ఈ మేరకు కెవిఎట్ పిటిషన్ ను అనంతబాబు (MLC Ananthababu) కుటుంబసభ్యులు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. ఇవాళ విచారణ జరిగింది.
దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23 నుంచి రిమాండ్ లో వున్నారు అనంతబాబు. ఏడు నెలలుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనంతబాబు రిమాండ్ లో వున్నాడు. మొదట రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ కోర్టు, తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్లు కొట్టివేశారు. దీంతో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనంతబాబు లాయర్లు. కేసులో విచారణ పూర్తి కాలేదని కోర్టుకు మెమోలు సమర్పించారు కాకినాడ పోలీసులు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ అనంతబాబు కేసును సిబిఐకి అప్పగించాలన్న పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో జరగనుంది విచారణ.
Read Also:Moga Cyclone: ‘మాండూస్’ ముగిసింది.. ‘మోగా’ మోగిస్తది
మే19 న హత్యకి గురి అయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు సంచలనం కలిగించింది. నాటకీయ పరిణామాల మధ్య మే 23 న అనంత బాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహంను కారు లో ఇంటికి తీసుకువచ్చాడు అనంతబాబు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, బంధువులు, దళిత సంఘాల ఆందోళనతో కేసు నమోదైంది. తల్లి మృతి తో మధ్యంతర బెయిల్ పొందిన అనంత బాబు.. బెయిల్ కోసం పట్టువదలకుండా ప్రయత్నించాడు. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదల కానున్నాడు అనంతబాబు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో