Bail For Mlc Ananthababu: అనంతబాబుకి బెయిల్.. సుప్రీంకోర్టులో రిలీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ అనంతబాబుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. అనంతబాబు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతులు ట్రయల్ కోర్టు నిర్దేశిస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజమండ్రిలోని ఎస్సి, ఎస్టీ కోర్టు, ఏపీ హైకోర్టు (High Court) అనంతబాబు (MLC Ananthababu) బెయిల్ పిటీషన్ కొట్టేశాయి.
Read Also: Tollywood Box Office: సినిమాలు ఫుల్… కలెక్షన్లు నిల్…
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
దీనితో అనంతబాబు కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డిఫాల్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును అనంతబాబు ఆశ్రయించారు. ఈ మేరకు కెవిఎట్ పిటిషన్ ను అనంతబాబు (MLC Ananthababu) కుటుంబసభ్యులు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. ఇవాళ విచారణ జరిగింది.
దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23 నుంచి రిమాండ్ లో వున్నారు అనంతబాబు. ఏడు నెలలుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనంతబాబు రిమాండ్ లో వున్నాడు. మొదట రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ కోర్టు, తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్లు కొట్టివేశారు. దీంతో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనంతబాబు లాయర్లు. కేసులో విచారణ పూర్తి కాలేదని కోర్టుకు మెమోలు సమర్పించారు కాకినాడ పోలీసులు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ అనంతబాబు కేసును సిబిఐకి అప్పగించాలన్న పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో జరగనుంది విచారణ.
Read Also:Moga Cyclone: ‘మాండూస్’ ముగిసింది.. ‘మోగా’ మోగిస్తది
మే19 న హత్యకి గురి అయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు సంచలనం కలిగించింది. నాటకీయ పరిణామాల మధ్య మే 23 న అనంత బాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహంను కారు లో ఇంటికి తీసుకువచ్చాడు అనంతబాబు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, బంధువులు, దళిత సంఘాల ఆందోళనతో కేసు నమోదైంది. తల్లి మృతి తో మధ్యంతర బెయిల్ పొందిన అనంత బాబు.. బెయిల్ కోసం పట్టువదలకుండా ప్రయత్నించాడు. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదల కానున్నాడు అనంతబాబు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!