రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొంచెం తగ్గడంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కాస్త తగ్గింది. దాంతో జలాశయం రేడియల్ క్రేస్ట్ గేట్లు మూసేసారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 72,852 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 65,441 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 884.70 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 213.8824 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంతో పాటుగా కుడి గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి మాత్రం కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరగనునట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.