Srisailam Arjitha Seva: శ్రీశైలక్షేత్రంలో నూతన ఆర్జిత సేవలు షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైలంలో నూతన సేవలకు శ్రీకారం చుట్టారు అధికారులు. ఆలయంలో ఉదయాస్తమానసేవ, ప్రదోషకాల సేవలను ప్రారంభించారు ఈవో లవన్న. సెప్టెంబర్ 5 నుంచి భక్తులకు ఈ సేవలు అందుబాటులోనికి రానున్నాయి. ద్వాదశ మహాక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం భక్తుల సౌకర్యార్ధం నూతనంగా ఉదయాస్తమానసేవ, ప్రదోమాలసేవలను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ట్రస్టుబోర్డు అనుమతి ఆదేశాలతో ఆలయ ఈవో లవన్న లాంచనంగా ప్రారంభించారు పరిపాలనా భవనంలో ఈ నూతన సేవలను ఆలయ అర్చకులు, వేదపండితులచే ఈ సేవలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు.
Read Also:Congress: కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ.. 50 మంది సీనియర్ నేతల రాజీనామా..
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఉదయాస్తమానసేవలో పాల్గొనే భక్తులకు ఆలయం ద్వారాలు తెరిచినది మొదలు తిరిగి ఆలయ ద్వారాలు మూసేంత వరకు శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహించే 14 సేవలలో పాల్గొనే విధంగా దేవస్థానం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా వేకువజామున గోపూజతో ప్రారంభమై రాత్రి ఏకాంతసేవతో ఈ ఉదయాస్తమానసేవ ముగిస్తుందని ఈవో తెలిపారు. అలాగే ప్రదోషకాల సేవలో పాల్గొనే భక్తులకు సాయంత్రం ఆలయంలో నిర్వహించే మహామంగళహారతి, స్వామివారి గర్భాలయంలో పంచామృతాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, వేదాశీర్వచనం కల్పిస్తున్నారు. అయితే భక్తులు ఈ సేవలలో పాల్గొనేందుకు దేవస్థానం వెబ్ సైట్ www.srisailadevastanam.org లేదా www.aptemples.ap.gov.in ద్వారా బుకింగ్ చేసుకోవచ్చును.
కాగా రోజుకు ఈ సేవలకు 6 టికెట్లు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్టు ఈవో తెలిపారు. ఉదయాస్తమానసేవకు రూ.1.01.116 లు. ప్రదోషకాల సేవకు రూ.25,116లు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అయితే సేవలలో పాల్గొనే భక్తులకు దేవస్థానంచే స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలను, స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను బహుకరిస్తూ వీటితో పాటు వసతి, అల్పాహారం, భోజనఏర్పాట్లను కల్పించనున్నారు. ఈ సేవలకు సంబంధించి టికెట్లను ఆన్ లైన్లో వచ్చే మార్చి నెల వరకు అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే విదేశాలలో ఉన్న భక్తులను దృష్టిలో ఉంచుకొని సంవత్సర టికెట్ క్యాలండర్ ను అందుబాటులోనికి తీసుకువస్తున్నట్లు ఈవో తెలిపారు.
Read Also: Komatireddy Rajagopal Reddy: మునుగోడు ఉప ఎన్నికతో.. కేసీఆర్ అరాచక పాలనను అంతం చేయాలి
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!