Srisailam Arjitha Seva: శ్రీశైలక్షేత్రంలో నూతన ఆర్జిత సేవలు షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైలంలో నూతన సేవలకు శ్రీకారం చుట్టారు అధికారులు. ఆలయంలో ఉదయాస్తమానసేవ, ప్రదోషకాల సేవలను ప్రారంభించారు ఈవో లవన్న. సెప్టెంబర్ 5 నుంచి భక్తులకు ఈ సేవలు అందుబాటులోనికి రానున్నాయి. ద్వాదశ మహాక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం భక్తుల సౌకర్యార్ధం నూతనంగా ఉదయాస్తమానసేవ, ప్రదోమాలసేవలను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ట్రస్టుబోర్డు అనుమతి ఆదేశాలతో ఆలయ ఈవో లవన్న లాంచనంగా ప్రారంభించారు పరిపాలనా భవనంలో ఈ నూతన సేవలను ఆలయ అర్చకులు, వేదపండితులచే ఈ సేవలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు.
Read Also:Congress: కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ.. 50 మంది సీనియర్ నేతల రాజీనామా..
Also Read
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
- Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
- Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
- Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
ఉదయాస్తమానసేవలో పాల్గొనే భక్తులకు ఆలయం ద్వారాలు తెరిచినది మొదలు తిరిగి ఆలయ ద్వారాలు మూసేంత వరకు శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహించే 14 సేవలలో పాల్గొనే విధంగా దేవస్థానం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా వేకువజామున గోపూజతో ప్రారంభమై రాత్రి ఏకాంతసేవతో ఈ ఉదయాస్తమానసేవ ముగిస్తుందని ఈవో తెలిపారు. అలాగే ప్రదోషకాల సేవలో పాల్గొనే భక్తులకు సాయంత్రం ఆలయంలో నిర్వహించే మహామంగళహారతి, స్వామివారి గర్భాలయంలో పంచామృతాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, వేదాశీర్వచనం కల్పిస్తున్నారు. అయితే భక్తులు ఈ సేవలలో పాల్గొనేందుకు దేవస్థానం వెబ్ సైట్ www.srisailadevastanam.org లేదా www.aptemples.ap.gov.in ద్వారా బుకింగ్ చేసుకోవచ్చును.
కాగా రోజుకు ఈ సేవలకు 6 టికెట్లు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్టు ఈవో తెలిపారు. ఉదయాస్తమానసేవకు రూ.1.01.116 లు. ప్రదోషకాల సేవకు రూ.25,116లు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అయితే సేవలలో పాల్గొనే భక్తులకు దేవస్థానంచే స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలను, స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను బహుకరిస్తూ వీటితో పాటు వసతి, అల్పాహారం, భోజనఏర్పాట్లను కల్పించనున్నారు. ఈ సేవలకు సంబంధించి టికెట్లను ఆన్ లైన్లో వచ్చే మార్చి నెల వరకు అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే విదేశాలలో ఉన్న భక్తులను దృష్టిలో ఉంచుకొని సంవత్సర టికెట్ క్యాలండర్ ను అందుబాటులోనికి తీసుకువస్తున్నట్లు ఈవో తెలిపారు.
Read Also: Komatireddy Rajagopal Reddy: మునుగోడు ఉప ఎన్నికతో.. కేసీఆర్ అరాచక పాలనను అంతం చేయాలి
తాజావార్తలు
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
-
Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై ‘ఈగల్ ఫోర్స్’ ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
-
Makkah: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్కు ముప్పు పొంచి ఉందా?
-
Tata Cars Price Hike: టాటా కార్లు కొనేవారికి ఇదే చివరి ఛాన్స్..! పెరగనున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ కార్ల ధరలు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!