Komatireddy Rajagopal Reddy: మునుగోడు ఉప ఎన్నికతో.. కేసీఆర్ అరాచక పాలనను అంతం చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Rajagopal Reddy Comments On CM KCR: మునుగోడు ఉపఎన్నికతో.. సీఎం కేసీఆర్ అరాచక పాలనను అంతం చేయాలని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సతీసమేతంగా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మునుగోడు ఉప ఎన్నిక.. 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం వచ్చే ఎన్నిక అని చెప్పారు. రాష్ట్రంలో 12 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని ఆరోపించిన రాజగోపాల్.. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని మునుగోడు ప్రజలను కోరారు. తాను బడుగు బలహీన వర్గాలు, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం నిజాయితీగా పోరాటం చేస్తానని.. మునుగోడు ప్రజలే తన దేవుళ్లని, వాళ్ల తీర్పుని శిరసా వహిస్తానని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా.. తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆగస్టు 21వ తేదీన మునుగోడులో నిర్వహించిన సమరభేరి కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే! ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీజేపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. రాష్ట్ర ప్రజల దృష్టిని తమ పార్టీవైపుకి తిప్పుకునేందుకు.. నేతలతో నిత్యం ప్రెస్మీట్లు, కార్యక్రమాలతో పాటు ఇతర వ్యూహాలను రచిస్తోంది. ఇంకా ఉప ఎన్నిక ఫోకస్ రాకపోయినప్పటికీ.. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తూ, ప్రజల్ని కలుసుకుంటున్నారు.
Also Read
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం