Duvvada Srinivas Controversy: ట్విస్టులే ట్విస్టులు.. దువ్వాడ కేసులో ఏం జరుగుతుంది..?
- వాడివేడీగా సాగుతోన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం..
- ఓ వైపు ఆయన.. మరోవైపు భార్యా పిల్లలు.. ఇంకో వైపు మాధురి..
- దువ్వాడ ఎపిసోడ్ లో రోజుకో ట్విస్ట్.. పూటకో మలుపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duvvada Srinivas Controversy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారంపై వాడివేడీగా చర్చ సాగుతోంది.. ఓ వైపు ఆయన.. మరోవైపు భార్యా పిల్లలు.. ఇంకో వైపు మాధురి.. ఇలా ట్విట్టుల మీద ట్విస్టులు.. మలుపుల మీద మలుపులు అన్నట్టుగా సాగుతోంది ఈ వ్యవహారం.. ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్టుగా కత్తులు దూసుకోవడం హాట్ టాపిక్గా మారిపోయింది..
Read Also: CM Chandrababu: నేడు మూడు కీలక శాఖలపై సీఎం సమీక్ష.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై నేడు క్లారిటీ..!
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
శ్రీకాకుళం రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు దువ్వాడ శ్రీనివాస్.. ఆయనకు కుటుంబంలోనే కాదు.. రాజకీయాల్లోనూ దురదృష్టమే వెంటాడింది.. ఎన్ని పార్టీలు మారినా.. పెద్దగా విజయాలు మాత్రం వరించలేదు.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.. 2001లో శ్రీకాకుళం జిల్లా యువతన కాంగ్రెస్ కార్యదర్శిగా.. 2006లో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేశారు.. ఇక, 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీచేసినా విజయం వరించలేదు.. 2014లో వైసీపీ అభ్యర్థిగానూ విక్టరీ కొట్టలేకపోయారు.. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా గెలవలేకపోయారు.. 2021లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ అయిన ఆయన పెద్దల సభలో ప్రవేశించారు..
Read Also: Helicopter Crash : ఆస్ట్రేలియాలో హోటల్ పైకప్పుపై కూలిన హెలికాప్టర్
ఇక, దువ్వాడ శ్రీనివాస్-వాణికి పెళ్లి జరిగి దాదాపు 30 ఏళ్లు అయ్యింది.. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు.. ఇద్దరూ డాక్టర్లే.. ఒకరికి పెళ్లి అయ్యింది.. అయితే, భార్యభర్తల మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయని తెలుస్తోంది.. రాజకీయ కారణాలు వాటికి ఆజ్యం పోసాయి అంటారు.. ఇలాంటి సమయంలోనే దువ్వాడ జీవితంలోకి దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చింది.. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.. వైసీపీ కార్యకర్త కూడా.. పార్టీలోకి వచ్చిరాగానే మండల పార్టీ అధ్యక్షురాలిని చేశారు దువ్వాడ.. ఇక, వివాదం చెలరేగడంతో.. చివరకు రాజీనామా చేశారు.. అయితే, రెండేళ్లుగా దువ్వాడ శ్రీనివాస్-మాధురి మధ్య సన్నిహిత్యం పెరిగిందని వాణి ఆరోపిస్తున్నారు.. అనేక ఆలయాలకు జంటగా తిరుగుతున్నారని జిల్లాలో జోరుగా చర్చ జరిగింది.. రహస్యంగా వివాహం చేసుకున్నారని కూడా పుకార్లు షికార్లు చేశాయి.. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఇలాంటి ప్రచారాలను వారు ఖండించకపోవడం.. అసలే 2024 ఎన్నికల్లో టికెట్ రాజేసిన గొడవలతో కుటుంబంలో కల్లోలం రేగితే.. మాధురి ఎపిసోడ్ మరింత గొడవ రాజేసింది.. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటిని నిర్మించుకున్నారు.. ఆ ఇంట్లోనే మాధురితో కలిసి ఉంటున్నారని భార్య ఆరోపిస్తోంది.. ఏ హక్కుతో ఆమె నా భర్తతో కలిసి ఉంటుందని దువ్వాడ వాణి ప్రశ్నిస్తోంది.. ఇక.. దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్లోని ట్విస్టులు.. అసలు ఏం జరుగుతోందనే పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..