CM Chandrababu: తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు.. సీఎం కీలక వ్యాఖ్యలు
- ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- శ్రీకాకుళం జిల్లా ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం
- వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించిన సీఎం
- తప్పు చేసిన వారిని వదిలిపెట్టను- చంద్రబాబు
- రాజకీయ కక్ష్యలు సాధింపులకు వెళ్లను- సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చంపినపుడు పీడ విరగడైందని ప్రజలు సంబరాలు, దీపావళి చేసుకున్నారు.. తాజా ఎన్నికల్లో నరకాసురుడిని ఓడించామని చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. 93 శాతం స్ట్రైక్ రేట్.. 43 ఏళ్లైంది పార్టీ పెట్టి.. ఎప్పుడూ ఇన్ని సీట్లు గెలవలేదని అన్నారు. తనను అనేక మంది హింస పెట్టారు.. రాజీ లేని పోరాటం చేశామని చెప్పారు. దౌర్భాగ్యకరమైన రోజులు చూశాం.. స్వేచ్ఛే లేదని చంద్రబాబు అన్నారు.
Read Also: First Analog Space Mission: మొట్టమొదటి అనలాగ్ మిషన్ను ప్రారంభించిన ఇస్రో
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
తప్పు చేసిన వారిని వదిలిపెట్టను.. రాజకీయ కక్ష్యలు సాధింపులకు వెళ్లనని సీఎం చంద్రబాబు తెలిపారు. దీపం-1 తానే ఇచ్చానని.. ఇప్పుడు దీపం- 2 పథకం కూడా తానే ప్రారంభిస్తున్నానని అన్నారు. ఆడ బిడ్జలు ఖర్చు తగ్గించడానికి ఉచిత గ్యాస్ ఇవ్వాలనుకున్నా.. డ్వాక్రాలు పెట్టానని చెప్పారు. భర్త కంటే భార్యకు ఆదాయం ఎక్కువ వస్తుంది.. అది తెలుగు దేశం ఇచ్చిన శక్తి అని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళలు, ఆడపిల్లలకు అనేక పథకాలు అమలు చేస్తూ వచ్చాను.. ఆడపిల్లలకు సమాజంలో గౌరవం ఉండాలి.. అప్పుడే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. కేంద్రం కొన్ని అడ్డంకులు పెట్టారు.. సిలిండర్లు డబ్బులు కడితే ఇస్తామంటున్నారు.. డబ్బులు కట్టే పనిలేకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.. ఏర్పాటు చేస్తానని చెప్పారు. సిలిండర్ కోసం ఇప్పుడు డబ్బులు కడితే.. 48 గంటల్లో తాను డబ్బులు వేస్తానని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉచిత సిలిండర్లుకు రూ.122 కోట్లు ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
Read Also: GST collection: అక్టోబర్లో పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..!
తాజావార్తలు
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2026 Playoffs Scenario: కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప!
-
BMW Vision K18: భవిష్యత్ హై-పర్ఫార్మెన్స్ టూరింగ్ బైక్.. బీఎండబ్ల్యూ విజన్ K18 ఆవిష్కరణ
-
Tilak Varma – Sreeleela : శ్రీలీల – తిలక్ వర్మ.. టీ20 లవ్..?
-
iQOO 15T: ఐకూ 15T వచ్చేస్తోంది.. 200MP ప్రధాన కెమెరా, 8000mAh బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..