CM Chandrababu: తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు.. సీఎం కీలక వ్యాఖ్యలు
- ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- శ్రీకాకుళం జిల్లా ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం
- వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించిన సీఎం
- తప్పు చేసిన వారిని వదిలిపెట్టను- చంద్రబాబు
- రాజకీయ కక్ష్యలు సాధింపులకు వెళ్లను- సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చంపినపుడు పీడ విరగడైందని ప్రజలు సంబరాలు, దీపావళి చేసుకున్నారు.. తాజా ఎన్నికల్లో నరకాసురుడిని ఓడించామని చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. 93 శాతం స్ట్రైక్ రేట్.. 43 ఏళ్లైంది పార్టీ పెట్టి.. ఎప్పుడూ ఇన్ని సీట్లు గెలవలేదని అన్నారు. తనను అనేక మంది హింస పెట్టారు.. రాజీ లేని పోరాటం చేశామని చెప్పారు. దౌర్భాగ్యకరమైన రోజులు చూశాం.. స్వేచ్ఛే లేదని చంద్రబాబు అన్నారు.
Read Also: First Analog Space Mission: మొట్టమొదటి అనలాగ్ మిషన్ను ప్రారంభించిన ఇస్రో
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
తప్పు చేసిన వారిని వదిలిపెట్టను.. రాజకీయ కక్ష్యలు సాధింపులకు వెళ్లనని సీఎం చంద్రబాబు తెలిపారు. దీపం-1 తానే ఇచ్చానని.. ఇప్పుడు దీపం- 2 పథకం కూడా తానే ప్రారంభిస్తున్నానని అన్నారు. ఆడ బిడ్జలు ఖర్చు తగ్గించడానికి ఉచిత గ్యాస్ ఇవ్వాలనుకున్నా.. డ్వాక్రాలు పెట్టానని చెప్పారు. భర్త కంటే భార్యకు ఆదాయం ఎక్కువ వస్తుంది.. అది తెలుగు దేశం ఇచ్చిన శక్తి అని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళలు, ఆడపిల్లలకు అనేక పథకాలు అమలు చేస్తూ వచ్చాను.. ఆడపిల్లలకు సమాజంలో గౌరవం ఉండాలి.. అప్పుడే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. కేంద్రం కొన్ని అడ్డంకులు పెట్టారు.. సిలిండర్లు డబ్బులు కడితే ఇస్తామంటున్నారు.. డబ్బులు కట్టే పనిలేకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.. ఏర్పాటు చేస్తానని చెప్పారు. సిలిండర్ కోసం ఇప్పుడు డబ్బులు కడితే.. 48 గంటల్లో తాను డబ్బులు వేస్తానని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉచిత సిలిండర్లుకు రూ.122 కోట్లు ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
Read Also: GST collection: అక్టోబర్లో పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..!
తాజావార్తలు
-
Test Match: ఆ ప్లేయర్కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
-
Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
-
Kitchen Tips: బియ్యంలో పురుగుల నుంచి బిర్యానీ రైస్ వరకు.. వంటగది రూపురేఖలు మార్చే అమేజింగ్ చిట్కాలు!
-
Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
-
Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!