Srikakulam Stampede: కాశీబుగ్గలో తొక్కిసలాట.. స్పందించిన మంత్రులు..
- కాశీబుగ్గలో తొక్కిసలాటపై ఏపీ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి..
- గాయపడిన వారికి సత్వర చికిత్స అందించాలని ఆదేశాలు..
- బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikakulam Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాటలో 12 మంది మృతి చెందిన దుర్ఘటనపై ఏపీ మంత్రులు స్పందించారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించాం.. బాధిత కుటుంబాలను ఓదార్పుతున్నాం.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అచ్చెన్నా అన్నారు.
Read Also: Kasibugga Stampede: తొక్కిసలాట ఘటన జరిగిన ఆలయం దేవాదాయశాఖ పరిధిలో లేదు..
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
అలాగే, శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటనతో హుటాహుటిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బయలుదేరారు. ఈ సందర్భంగా ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. జిల్లా అధికార యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యేను అడిగి సంఘటన వివరాలను తెలుసుకున్నాను.. తొక్కిసలాట ఘటన జరగటం నా మనసును కలచివేసింది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Read Also: KTR: తెలంగాణలో ప్రస్తుతం “ఆహా నా పెళ్ళంట సినిమా కథ” లాగానే ఉంది..
ఇక, విద్యుత్ శాక మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ.. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించాం.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు.
Read Also: YS Jagan: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్బ్రాంతి..
కాగా, పలాసలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో హుటాహుటిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ పర్యటనలో ఉన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బయలుదేరి వస్తున్నారు. ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi తమ్ముడి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ ఇదే..
-
Ghee Roast Crispy Chilla Recipe: బిజీ మార్నింగ్స్కు బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. నెయ్యి రోస్ట్ చిల్లా ట్రై చేయండి
-
Home Cleaning Tips : ఇంట్లో దుర్వాసన వస్తోందా? కారణం ఇదే కావచ్చు.. ఈ చిన్న మార్పులతో ఇల్లు రోజంతా ఫ్రెష్గా ఉంటుంది!
-
Vastu Tips: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ 4 విషయాలు కనిపిస్తే రోజంతా పాజిటివ్గా ఉంటారా? వాస్తు ఏమి చెబుతోంది?
-
Canada vs Bosnia: సూపర్ సబ్ ‘లారిన్’ మ్యాజిక్.. బోస్నియా, కెనడా 1-1తో డ్రా.!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!