Srikakulam Stampede: కాశీబుగ్గలో తొక్కిసలాట.. స్పందించిన మంత్రులు..
- కాశీబుగ్గలో తొక్కిసలాటపై ఏపీ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి..
- గాయపడిన వారికి సత్వర చికిత్స అందించాలని ఆదేశాలు..
- బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikakulam Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాటలో 12 మంది మృతి చెందిన దుర్ఘటనపై ఏపీ మంత్రులు స్పందించారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించాం.. బాధిత కుటుంబాలను ఓదార్పుతున్నాం.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అచ్చెన్నా అన్నారు.
Read Also: Kasibugga Stampede: తొక్కిసలాట ఘటన జరిగిన ఆలయం దేవాదాయశాఖ పరిధిలో లేదు..
Also Read
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
అలాగే, శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటనతో హుటాహుటిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బయలుదేరారు. ఈ సందర్భంగా ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. జిల్లా అధికార యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యేను అడిగి సంఘటన వివరాలను తెలుసుకున్నాను.. తొక్కిసలాట ఘటన జరగటం నా మనసును కలచివేసింది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Read Also: KTR: తెలంగాణలో ప్రస్తుతం “ఆహా నా పెళ్ళంట సినిమా కథ” లాగానే ఉంది..
ఇక, విద్యుత్ శాక మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ.. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించాం.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు.
Read Also: YS Jagan: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్బ్రాంతి..
కాగా, పలాసలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో హుటాహుటిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ పర్యటనలో ఉన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బయలుదేరి వస్తున్నారు. ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
తాజావార్తలు
-
Toxic : ‘పాన్ ఇండియా స్టార్’ అనే టైటిల్ శాశ్వతం కాదు.. అది ఏ ఒక్కరి సొత్తు కాదు : యశ్
-
Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!
-
Himanshi Khurana: మతం మారమని ప్రియుడి ఒత్తిడి.. దేవుడికి ద్రోహం చేయలేనంటూ.. నటి ప్రేమకథ వెనుక కన్నీటి నిజాలు
-
Varanasi Airport Gunfire: ఎయిర్పోర్టులో కాల్పుల కలకలం.. లైసెన్స్డ్ పిస్టల్ పేలడంతో ఇద్దరు సిబ్బందికి గాయాలు
-
Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!