Kakarla Suresh: వింజమూరు మండలంలో వైసీపీ ఖాళీ కాబోతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వింజమూరు మండల కేంద్రంలో శుక్రవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్యం కోసం తలపెట్టిన ప్రజాగళం దద్దరిల్లింది. ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో.. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుండి తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజాగళం సభకు తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలని జనం చంద్రబాబు ప్రసంగానికి జేజేలు పలికారు. చంద్రబాబు నాయుడు మాటలు ఆసక్తిగా విన్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. పెద్ద ఎత్తున టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేశారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో వింజమూరు మండలానికి చెందిన ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరిన వారిలో సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి, వనిపెంట హైమావతి, బసిరెడ్డి సుమలత, యాకసిరి భవాని, సాదం మౌనిక, కాటం ప్రసన్న, వింజమూరు మండలం ఎంపీపీ ఇనగనూరి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాదం మౌనిక జనసేన పార్టీ తరఫున గెలిచినప్పటికీ వైసీపీ అనుబంధంగా వ్యవహరిస్తుంది. ఆమె చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంది.
Also Read
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
Andhra Pradesh: వాలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు
వింజమూరు మండలంలో మంచి పట్టున్న నాయకుడిగా పేరుపొందిన వనిపెంట సుబ్బారెడ్డి టీడీపీలోకి రావడంతో ఆయన అనుచర వర్గం హర్షం వ్యక్తం చేస్తుంది. జననేతగా పేరున్న వనిపెంట సుబ్బారెడ్డి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన సత్తాను చాటనున్నారు. గత ఎంపీపీ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో ఇప్పటికే రుజువు చేసుకొని ఉన్నారు. ఏప్రిల్ 10వ తేదీ లోపల భారీ ఎత్తున వైసీపీ సీనియర్ నాయకులు టీడీపీలో చేరెందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ప్రజా గళం సాక్షిగా చెప్తున్నాను. వచ్చే పదిరోజుల్లో వింజమూరు మండలంలో వైసీపీ ఖాళీ కావడం ఖాయమని ఘంటా పదంగా తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విశ్వాసం కోల్పోయారని.. ఉదయగిరి ప్రజల దీవెనలతో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నట్లు సభ సాక్షిగా తెలిపారు. ఉదయగిరిలో తాను, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలవడం తధ్యం అని అన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, యువతకు ఉద్యోగాలు వస్తాయని, మెట్ట ప్రాంతానికి సాగు త్రాగునీరుతో పాటు.. సమ్మర్ స్టోరీస్ ట్యాంకు నిర్మాణం జరుగుతుందని ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా మారుస్తానని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!