Rottela Panduga: రొట్టెల పండుగకు సర్వం సిద్ధం.. కోర్కెలు తీర్చే ఆ రొట్టెల చరిత్ర ఏంటి..?
- ఈ నెల 6 నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ..
- విస్తృత ఏర్పాట్లు చేస్తోన్న కూటమి ప్రభుత్వం..
- అసలు ఈ రొట్టెల పండుగ ఎలా వచ్చింది..
- రొట్టెల పండుగ వెనుక చరిత్ర ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rottela Panduga: కులమతాలకు అతీతంగా.. మతసామరస్యాలకు ప్రతీకగా నెల్లూరు జిల్లాలో ప్రతి ఏటా రొట్టెల పండుగ జరుగుతుంది. మొహరం సందర్భంగా జరిగే ఈ పండుగకు దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు వస్తుంటారు. 6 నుంచి జరిగే రొట్టెల పండుగని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అసలు రొట్టెల పండుగను ఎందుకు జరుపుకుంటారు అనడానికి ఒక స్టోరీ ప్రాచుర్యంలో ఉంది. 1751లో ఇస్లాం మతాన్ని ప్రచారం చేసేందుకు 12 మంది మతప్రబోధకులు సౌదీ అరేబియా నుంచి ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో తమిళనాడు, నెల్లూరు ప్రాంతాలను నవాబులు పాలించేవారు. కాగా, సౌదీ నుంచి వచ్చిన ప్రబోధకులు నెల్లూరు జిల్లా దగ్గరి కొడవలూరుకు వెళతారు. అక్కడ ఇతర మతస్థులు వీరిని అడ్డుకుంటారు. వారితో ఈ 12 మంది వీరోచితంగా పోరాడతారు. ఆ పోరాటంలో సౌదీ వీరులు మరణిస్తారు. అలా చనిపోయిన 12 మంది మృతదేహాలను గుర్రాలు లాక్కొచ్చి స్వర్ణాల చెరువు పక్కన వదిలేస్తాయి. ఆ మృతదేహాలు అక్కడే భూమిలో కలిసిపోతాయి. స్థానికులు ఆ ప్రదేశాలలోనే వారికి సమాధులు కట్టేస్తారు. అలా ఆ దర్గాకు బారాషహీద్ దర్గా అని పేరు వచ్చింది.
Read Also: Cyberabad Police: స్పా సెంటర్లకు ఇక దబిడి దిబిడే.. హెచ్చరికలు జారీచేసిన పోలీసులు
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
- YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
- YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
ఇక, దర్గా ప్రాంగణంలోని బారాషహిధులను దర్శనం చేసుకుని.. అనంతరం స్వర్ణాల చెరువులో తమ కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు ఏదైనా కోరికను కోరుకొని ఆ రొట్టెను వదిలే వారి నుంచి తీసుకుంటారు. గత ఏడాది తాము అనుకున్న కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకొని అది నెరవేరితే మరుసటి ఏడాది వచ్చే ఆ రొట్టెను వదులుతామని భక్తులు కోరుకుంటారు. అలా సంతాన రొట్టె.. ఆరోగ్య రొట్టె.. చదువు రొట్టె, వివాహ రొట్టె, విదేశీ రొట్టె, ఉద్యోగ రొట్టె.. 12 రకాల కోరికలకు సంబంధించిన రొట్టెలను ఇక్కడ మార్పిడి చేసుకుంటూ ఉంటారు. గతంలో మొహరం రోజున మాత్రమే ఈ రొట్టెల పండుగను నిర్వహించేవారు. అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఐదు రోజులు పాటు నిర్వహిస్తున్నారు.
Read Also: Allahabad High Court: శ్రీ కృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా కేసులో హిందూ పక్షానికి ఎదురుదెబ్బ..
రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం సానపు గదులు మహిళల కోసం ప్రత్యేకంగా దుస్తులు మార్చుకునే గదులతో పాటు టాయిలెట్స్ నిర్మాణాలు చేపట్టింది. దొంగతనాలు దొరక్కుండా పోలీస్ శాఖ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బృందాలను సైతం నియమించింది. ఈ ఐదు రోజులు పాటు పారిశుద్ధ్య నిర్వహణపై కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. మొదటి రోజున సందల్ మాలి, రెండో రోజున గంధ మహోత్సవం నిర్వహిస్తారు. బారా షహిద్ లకు గంధాన్ని లేపనం చేసిన తర్వాత గంధాన్ని భక్తులకు పంచి పెడతారు.. మూడో రోజు రొట్టెల పండుగ.. ఇలా ఐదు రోజులపాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రొట్టెల పండుగ ఐదు రోజులు నెల్లూరుకి వాహనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ట్రాఫిక్ పై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది..
తాజావార్తలు
-
Mirzapur The Movie : మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..