Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ration Mafia In Nellore Differences In The Nda Coalition Government

Ration Mafia: నెల్లూరులో రేషన్‌ మాఫియా.. కూటమిలో కుంపటి..!

Published Date :October 16, 2025 , 9:00 pm
By Sudhakar Ravula
  • నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా..
  • కూటమిలో కుంపటి రాజేసిన రేషన్ మాఫియా..
Ration Mafia: నెల్లూరులో రేషన్‌ మాఫియా.. కూటమిలో కుంపటి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ration Mafia: నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్న రేషన్ మాఫియా కూటమిలో కుంపటి రాజేసింది. సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యంతో రేషన్ మాఫియా చెలరేగుతుందని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ శాఖలో రాజకీయ దుమారం రేపాయి. పార్టీకి ఎవరు చెడ్డ పేరు తీసుకొచ్చిన సహించను అంటూ అయన వ్యాఖ్యలు చేశారు. దీంతో నెల్లూరు రేషన్ మాఫియాలో కింగ్ పింగ్ గా ఉన్న సివిల్ సప్లై రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వైపే అధికార పార్టీ నేతలు చూపు వెళ్ళింది. ఆయన కనుసన్నల్లోనే రేషన్ మాఫియా జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. తన శాఖ మీద విమర్శలు చెయ్యడాన్ని మంత్రి నాదెండ్ల సీరియస్ అయ్యారు.

Read Also: Andhra Pradesh Train Crime: కదులుతున్న రైలులో ప్రయాణికురాలిపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు

Also Read

  • Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
  • YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
  • YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
  • Love Attack: కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి హత్య..

నెల్లూరు కేంద్రంగా జరుగుతున్న రేషన్ దందాపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. పలు మిల్లులో రీసైక్లింగ్.. ఆపై అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు ఎవరిని దానిపై సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరా తీస్తున్నారు. సివిల్ సప్లై అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉండడంతో.. వారితో మంత్రి నాదెళ్ల మనోహర్ సమావేశమయ్యారట. వారి వద్ద నుంచి సమాచారం తీసుకుని.. రేషన్ దందాపై ఉన్నతాధికారులతో దర్యాప్తు జరపాలన్న ఆలోచనలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారట. ఇదే సమయంలో రేషన్ మాఫియాకి సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని మంత్రి నాదెండ్ల మందలించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. నెల్లూరు ప్రకాశం చిత్తూరు జిల్లాలలో పెద్ద ఎత్తున రేషన్ అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటూ మంత్రి నాదెండ్ల తన శాఖకు చెందిన ఉన్నతాధికారులపై సీరియస్ అయ్యారట..

ఇటీవల నెల్లూరు రూరల్ పరిధిలో ఐదు లారీలలో తరలిస్తున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. వాటిలో రెండు లారీల్లో మాత్రమే రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అనంతసాగర్ మండలానికి చెందిన మహేష్ అనే వ్యక్తిపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మిగిలిన మూడు లారీలని వదిలేశారు. అయితే ఈ వ్యవహారంపై నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. రేషన్ మాఫియా కి సివిల్ సప్లై అధికారులు సహకరిస్తున్నారని విమర్శించారు. అధికారులు పట్టుకున్న ఐదు లారీలలో రేషన్ బియ్యం ఉన్నాయని.. అయితే, రెండు లారీల్లో మాత్రమే రేషన్ బియ్యం ఉన్నట్లు… మిగిలిన మూడు లారీలని వదిలేసారని ఆయన ఆరోపించారు. జిల్లాలో పెద్ద ఎత్తున రేషన్ అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మాఫియా వెనుక ఎవరున్నా వదిలేది లేదంటూ.. వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లు పార్టీలో ప్రచారం జరిగింది. దీన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం.. వారిద్దరిని మందలించింది..

నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా చేస్తున్న వారిలో ఇద్దరు ముగ్గురు కీలక వ్యాపారులో ఉన్నట్లు సివిల్ సప్లై శాఖలో ప్రచారం జరుగుతుంది. వారిలో అనంతసాగరం మండలానికి చెందిన మహేష్ రెడ్డి అనే వ్యక్తి ఒకరు. వీరందరూ సివిల్ సప్లై కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పట్టాభి రామిరెడ్డి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని టిడిపిలో చర్చించుకుంటున్నారు. వీరందరూ సిండికేట్ ఏర్పడి.. గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని సేకరించి మిల్లులో రీసైక్లింగ్ చేసి చెన్నైకి తరలిస్తున్నారు. జిల్లాలో సుమారు 80 శాతం రేషన్ బియ్యాన్ని వీరు సేకరిస్తున్నట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులను మేనేజ్ చేసుకుని.. పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఐతే తమ నియోజకవర్గాల్లో జరిగే రేషన్ దందా.. ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు తెలియకుండానే జరుగుతోందని.. వారి వారి అనుచరులు చెబుతున్నారు. అయితే జిల్లాలో ఎంత జరుగుతున్న సివిల్ సప్లై అధికారులు గానీ విజిలెన్స్ అధికారులు కానీ కనీసం తనిఖీలు దాడులు చేయకపోవడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన వారే ఈ మాఫియా లో కీలక పాత్ర పోషిస్తూ ఉండడంతో.. అధికారులు సైతం మౌనంగా ఉండి పోతున్నారు. అయితే రేషన్ మాఫియా పై నువ్డా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శలు చేయడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో జిల్లాకు చెందిన సివిల్ సప్లై అధికారి విజయ్ కుమార్, సివిల్ సప్లై డిఎం అర్జున్ రావు, ASO, సివిల్ సప్లై డిటిలను మంత్రి నాదెండ్ల మనోహర్ పిలిపించుకొని.. పూర్తి వివరాలు తీసుకున్నారట.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Government
  • Nellore.. NDA
  • Ration Mafia

తాజావార్తలు

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!

  • jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

  • OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions