Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Woman Assaulted On Train Accused Arrested In Andhra Pradesh

Andhra Pradesh Train Crime: కదులుతున్న రైలులో ప్రయాణికురాలిపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు

Published Date :October 16, 2025 , 9:05 pm
By Shiva Ganesh
Andhra Pradesh Train Crime: కదులుతున్న  రైలులో ప్రయాణికురాలిపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Andhra Pradesh Train Crime: రైలులో ప్రయాణికురాలిపై అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేప్ చేసిన నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడుకు చెందిన జోన్నలగడ్డ రాజారావుగా గుర్తించారు. రెండు నెలల క్రితం కేరళకు చెందిన మహిళపైనా అతడు అత్యాచారం చేసినట్లు వెల్లడైంది. సంత్రగచి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌‌లో మహిళా బోగీలో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారం ఘటన సంచలనం రేపుతోంది. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు.. గుంటూరు జిల్లా నడికుడి పీఎస్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం నడికుడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహిళపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించడంతో.. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

READ ALSO: Pawan Kalyan : వాళ్లను చూసి పవన్ కల్యాణ్‌ సిగ్గుపడ్డారు.. సమంత షాకింగ్ కామెంట్స్

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ సంత్రగచి ఎక్స్ ప్రెస్‌ ట్రైన్‌లో హైదరాబాద్‌‌కి వస్తోంది. రాజమండ్రి స్టేషన్‌లో మధ్యాహ్నం ఒకటిన్నరకి ట్రైన్‌ ఎక్కినట్లు ఆ మహిళ చెప్తోంది. రైలు గుంటూరు స్టేషన్‌కు చేరుకున్నాక.. తోటి మహిళా ప్రయాణికులంతా దిగిపోయారు. రైలు కదులుతుండగా సుమారు 40 ఏళ్ల వయసున్న ఆగంతకుడు బోగీ వద్దకు వచ్చాడు. మిగతా బోగీల డోర్లన్నీ లాక్ చేసి ఉన్నాయని.. బోగీ తలుపు తీయాలని కోరడంతో మహిళ డోర్‌ తీసింది. రైలు కదిలిన 20 నిమిషాల వరకు బాగానే ఉన్న ఆ వ్యక్తి.. ఒక్కసారిగా మహిళ వద్దకు వెళ్లి కత్తి చూపించి బెదిరించాడు. దీంతో ఆ మహిళ.. తన వద్ద డబ్బులున్న బ్యాగు, మొబైల్ ఫోన్‌ను అతడికి ఇచ్చి.. భయంతో బాత్‌రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుంది…

బాత్‌రూమ్‌ డోర్‌ తీయకపోతే.. బ్యాగ్‌, మొబైల్‌ ట్రైన్‌ నుంచి విసిరేస్తానని చెప్పడంతో ఆ మహిళ గడియ తీసింది. దీంతో ఆమెను బాత్రూం నుంచి బయటకు లాగాడు అగంతకుడు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెదకూరపాడు స్టేషన్ సమీపంలో రైలు నెమ్మదించడంతో బ్యాగులో ఉన్న 5,600, ఫోన్ తీసుకొని కిందకు దూకి పారిపోయాడని బాధితురాలు చెబుతోంది. బాధిత మహిళ హైదరాబాద్‌లోని చర్లపల్లిలో స్టేషన్‌లో దిగి.. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది… జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన చర్లపల్లి పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతం నడికుడి పోలీస్ స్టేషన్ పరిధిలోది కావడంతో కేసును నడికుడికి బదిలీ చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు.. అత్యాచారానికి పాల్పడ్డ అగంతకుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు…

సీసీ ఫుటేజ్‌‌లో లభ్యం కాని మహిళ ఆనవాళ్లు
ఈ కేసులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. బాధిత మహిళ చెబుతున్న విషయాలు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులు అయోమయానికి గురవుతున్నారు. రాజమండ్రిలో మధ్యాహ్నం 1.30 కి ట్రైన్‌ ఎక్కి నట్లు మహిళ చెప్తున్నా… సీసీ ఫుటేజ్‌‌లో ఎలాంటి ఆనవాళ్లు లేవు. మహిళ కట్టుకున్న చీర, చేతిలో ఉన్న బ్యాగ్‌ రంగు ఆధారంగా, టైం ఆధారంగా అన్ని సీసీ కెమెరాలు పరిశీలించారు రాజమండ్రి రైల్వే పోలీసులు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. అసలు ఆ మహిళ రాజమండ్రి స్టేషన్‌లో ట్రైన్‌ ఎక్కలేదని చెబుతున్నారు. మహిళ మాత్రం రాజమండ్రిలో ట్రైన్‌ ఎక్కాను అని చెప్తోంది. బాధిత మహిళను రేపు మరోసారి గుంటూరు మేజిస్ట్రేట్ ముందు ఇన్ కెమెరాలో హాజరుపర్చి.. స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయనున్నారు…

READ ALSO: Henley Passport Index 2025: ప్రపంచంలోనే అత్యంత చెత్త పాస్‌పోర్ట్ పాకిస్థాన్ సొంతం.. భారత్ ర్యాంక్ ఎంత అంటే?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Accused arrested
  • Andhra Pradesh train crime
  • crime news Andhra Pradesh
  • Guntur police case
  • Indian Railways Safety

తాజావార్తలు

  • India vs England: ఇంగ్లాండ్‌ను ఢీకొట్టేందుకు వ్యూహాలు సిద్ధం.. అభిషేక్ ఫామ్‌పై దినేశ్ కార్తిక్ కీలక వ్యాఖ్యలు

  • Divorce case: వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులు ఇవ్వలేం.. హైకోర్టు కీలక తీర్పు..

  • Nitish Kumar: సీఎంగా తప్పుకుంటున్నా.. అధికారిక ప్రకటన చేసిన నితీష్ కుమార్..

  • Made in Korea: ఆకట్టుకుంటున్న ‘మేడిన్ కొరియా’ ట్రైలర్!

  • Real Estate Scam: అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో కుచ్చుటోపీ.. మరో రియల్ ఎస్టేట్ ఘరానా మోసం వెలుగులోకి!

ట్రెండింగ్‌

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions