Andhra Pradesh Train Crime: కదులుతున్న రైలులో ప్రయాణికురాలిపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Train Crime: రైలులో ప్రయాణికురాలిపై అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేప్ చేసిన నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడుకు చెందిన జోన్నలగడ్డ రాజారావుగా గుర్తించారు. రెండు నెలల క్రితం కేరళకు చెందిన మహిళపైనా అతడు అత్యాచారం చేసినట్లు వెల్లడైంది. సంత్రగచి ఎక్స్ప్రెస్ ట్రైన్లో మహిళా బోగీలో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారం ఘటన సంచలనం రేపుతోంది. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు.. గుంటూరు జిల్లా నడికుడి పీఎస్కు బదిలీ చేశారు. ప్రస్తుతం నడికుడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహిళపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించడంతో.. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
READ ALSO: Pawan Kalyan : వాళ్లను చూసి పవన్ కల్యాణ్ సిగ్గుపడ్డారు.. సమంత షాకింగ్ కామెంట్స్
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ సంత్రగచి ఎక్స్ ప్రెస్ ట్రైన్లో హైదరాబాద్కి వస్తోంది. రాజమండ్రి స్టేషన్లో మధ్యాహ్నం ఒకటిన్నరకి ట్రైన్ ఎక్కినట్లు ఆ మహిళ చెప్తోంది. రైలు గుంటూరు స్టేషన్కు చేరుకున్నాక.. తోటి మహిళా ప్రయాణికులంతా దిగిపోయారు. రైలు కదులుతుండగా సుమారు 40 ఏళ్ల వయసున్న ఆగంతకుడు బోగీ వద్దకు వచ్చాడు. మిగతా బోగీల డోర్లన్నీ లాక్ చేసి ఉన్నాయని.. బోగీ తలుపు తీయాలని కోరడంతో మహిళ డోర్ తీసింది. రైలు కదిలిన 20 నిమిషాల వరకు బాగానే ఉన్న ఆ వ్యక్తి.. ఒక్కసారిగా మహిళ వద్దకు వెళ్లి కత్తి చూపించి బెదిరించాడు. దీంతో ఆ మహిళ.. తన వద్ద డబ్బులున్న బ్యాగు, మొబైల్ ఫోన్ను అతడికి ఇచ్చి.. భయంతో బాత్రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకుంది…
బాత్రూమ్ డోర్ తీయకపోతే.. బ్యాగ్, మొబైల్ ట్రైన్ నుంచి విసిరేస్తానని చెప్పడంతో ఆ మహిళ గడియ తీసింది. దీంతో ఆమెను బాత్రూం నుంచి బయటకు లాగాడు అగంతకుడు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెదకూరపాడు స్టేషన్ సమీపంలో రైలు నెమ్మదించడంతో బ్యాగులో ఉన్న 5,600, ఫోన్ తీసుకొని కిందకు దూకి పారిపోయాడని బాధితురాలు చెబుతోంది. బాధిత మహిళ హైదరాబాద్లోని చర్లపల్లిలో స్టేషన్లో దిగి.. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది… జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన చర్లపల్లి పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతం నడికుడి పోలీస్ స్టేషన్ పరిధిలోది కావడంతో కేసును నడికుడికి బదిలీ చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు.. అత్యాచారానికి పాల్పడ్డ అగంతకుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు…
సీసీ ఫుటేజ్లో లభ్యం కాని మహిళ ఆనవాళ్లు
ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధిత మహిళ చెబుతున్న విషయాలు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులు అయోమయానికి గురవుతున్నారు. రాజమండ్రిలో మధ్యాహ్నం 1.30 కి ట్రైన్ ఎక్కి నట్లు మహిళ చెప్తున్నా… సీసీ ఫుటేజ్లో ఎలాంటి ఆనవాళ్లు లేవు. మహిళ కట్టుకున్న చీర, చేతిలో ఉన్న బ్యాగ్ రంగు ఆధారంగా, టైం ఆధారంగా అన్ని సీసీ కెమెరాలు పరిశీలించారు రాజమండ్రి రైల్వే పోలీసులు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. అసలు ఆ మహిళ రాజమండ్రి స్టేషన్లో ట్రైన్ ఎక్కలేదని చెబుతున్నారు. మహిళ మాత్రం రాజమండ్రిలో ట్రైన్ ఎక్కాను అని చెప్తోంది. బాధిత మహిళను రేపు మరోసారి గుంటూరు మేజిస్ట్రేట్ ముందు ఇన్ కెమెరాలో హాజరుపర్చి.. స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు…
తాజావార్తలు
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
-
Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
-
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
-
CM Chandrababu : భారత్ పారిశ్రామిక వృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?