South Central Railway: ప్రయాణికులకు శుభవార్త.. సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
South Central Railway: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. రద్దీ దృష్ట్యా ఈనెల 12 నుంచి పలు ప్రాంతాలకు ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-తిరుపతి, హైదరాబాద్-గోరఖ్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 12న సికింద్రాబాద్-తిరుపతి మధ్య (రైలు నంబర్ 07411) ప్రత్యేక రైలును నడుపుతున్నామని తెలిపారు. ఈ రైలు సికింద్రాబాద్లో సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు తిరుపతి చేరుతుంది. ఈనెల 13న తిరుపతి-సికింద్రాబాద్ మధ్య (రైలు నంబర్ 07412) ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు తిరుపతిలో సాయంత్రం 5:15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 5:55 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రెండు ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.
Read Also: Fire : కార్లలో మంటలు.. కలవరపడిన ప్రయాణికులు
Also Read
అటు ఈనెల 14న హైదరాబాద్-గోరఖ్పూర్ మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైలు హైదరాబాద్లో శుక్రవారం రాత్రి 9:05 గంటలకు బయలుదేరి.. ఆదివారం ఉదయం 6:30 గంటలకు గోరఖ్పూర్ చేరుతుంది. ఈనెల 16న గోరఖ్పూర్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు గోరఖ్పూర్లో ఆదివారం ఉదయం 8:30 గంటలకు బయలుదేరి.. సోమవారం సాయంత్రం 4:20 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ రెండు రైళ్లు సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బలర్షా, నాగ్ పూర్, భోపాల్, బినా, కాన్ పూర్, లక్నో స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు. అటు ఈనెల 15న బెంగళూరు-విశాఖ మధ్య ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు బెంగళూరులో మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖ చేరుతుంది. ఈనెల 12న బెంగళూరు-జోధ్పూర్ మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైలు బెంగళూరులో ఉదయం 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:15 గంటలకు జోధ్పూర్ చేరుతుంది.

తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!