అన్నవరం ఆలయంలో చేతివాటం ఎవరిది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అది ఏటా వందకోట్ల ఆదాయం వచ్చే ఆలయం. ఎవరు గుర్తించరని అనుకున్నారో.. ఇంతకంటే మంచి తరుణం రాదని భావించారో.. చేతివాటం ప్రదర్శిస్తున్నారట. కమీషన్లు పెంచి ముడుపులు దండుకున్నారట. నిధులు దారి మళ్లించడంలోనూ వారి తర్వాతేనని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
దాతలు ఇచ్చే దాంట్లో ఎవరిది చేతివాటం?
Also Read
- OTR : ఇంటింటికీ టీడీపి.. గోదావరి జిల్లాలో గ్లాస్ ఎమ్మెల్యేల గందరగోళం
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
- OTR : కోఆర్డినేటర్లు మారినా మారని నేతలు.. అనంతపురంలో టిడిపికి తప్పని తలనొప్పి?
- OTR : అధిష్టానం పిలుపుతో తగ్గిన బొండా.. వైసీపీ నేతలపై విరుచుకుపడటం వెనుక రీజన్ ఏంటి?
భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అన్నవరం సత్యనారాయణ స్వామి. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయ పాలకమండలి ఛైర్మన్ రోహిత్. ఈవో త్రినాథ్. దేవుడికి వచ్చే ప్రతి రూపాయిని సద్వినియోగం చేసి అభివృద్ధి బాటలో నడిపించే బాధ్యత వీరిదే. కానీ.. నిధులను వేరే సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఏటా స్వామివారికి 100 కోట్లకు పైబడి ఆదాయం వస్తుంది. ఆ మేరకు రత్నగిరిపై భక్తులకు సరైన సదుపాయాలు లేవనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దాతలు ఇచ్చే విరాళాలతో కాటేజీలు నిర్మించారు తప్ప.. ఆలయ నిధులతో ఒక్కటీ చేపట్టలేదు. దాతల సహకారంతో నిర్మాణాలు పూర్తి చేసుకునే వాటిలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కమీషన్ పెంపులోనూ చేతులు మారిన ముడుపులు?
రిలీఫ్ ఫండ్కు రూ.4.80 కోట్లు మళ్లింపు?
ఇటీవల జరిగిన దేవస్థానం పాలకమండలి సమావేశంలో 30 శాతంగా ఉన్న వ్రత పురోహితుల కమీషన్ను 40 శాతానికి పెంచారు. పైకి కమీషన్ పెంపు సాధారణంగానే కనిపించినా.. ఈ నిర్ణయం తీసుకోవడానికి భారీగా ముడుపులు చేతులు మారినట్టు చెబుతున్నారు. కరోనా వల్ల కొద్దిరోజులు ఆలయం మూసివేశారు. తిరిగి తెరిచినా గతంలోలా భక్తుల రద్దీ లేదు. ఆదాయం తగ్గింది. ఈ సమయంలోనూ ఆలయానికి చెందిన 4 కోట్ల 80 లక్షలు రిలీఫ్ ఫండ్కు మళ్లించారట. దీనిపై రగడ జరుగుతోంది.
అకౌంట్స్ పరిశీలించిన తర్వాత ఏం జరిగింది?
గత ఏడాది కరోనా వల్ల 180 రోజులపాటు ఆలయం మూసివేశారు. సిబ్బందికి 8 నెలలపాటు సగం జీతాలే ఇచ్చారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కూడా అదే పరిస్థితి. మే 8న మూతపడ్డ ఆలయం జూన్ 11న తెరుచుకున్నా.. భక్తుల తాకిడి లేదు. ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఇచ్చేది సగం జీతమే అయినా అది కూడా రెండో వారానికి కానీ అందడం లేదట. ఇలాంటి ప్రతికూల సమయంలో ఆలయ ఉద్యోగులను ఆదుకోకుండా రిలీఫ్ ఫండ్కు 4 కోట్ల 80 లక్షలు మళ్లించడంపై ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఏప్రిల్ 27న దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆలయానికి వచ్చి అకౌంట్స్ పరిశీలించిన తర్వాత ఏం జరిగిందా అని మరికొందరు ఆరా తీస్తున్నారట.
పాలకమండలి పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టడం లేదా?
రెండేళ్ల క్రితం ఈవోగా వచ్చిన త్రినాథ్.. సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా ఇక్కడి సమస్యలకు ఒక కారణంగా ఉద్యోగవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. పాలకమండలి సైతం పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టడం లేదట. గత ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటైన పాలకమండలి కొండకు చుట్టపు చూపుగా వస్తోందట. ఛైర్మన్ రోహిత్ ఆలయంపై పట్టు సాధించలేదట. కొందరు సిబ్బంది ఏం చెబితే అదే ఆయన చేస్తున్నారట. దాంతో పోస్టు కాపాడుకోవాలని అనుకుంటున్నారో ఏమో.. కీలక నిర్ణయాల్లో ఛైర్మన్ భాగస్వామ్యం కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు ఆడింది ఆట.. పాడింది పాటగా ఉందట. మరి.. భక్తుల కోర్కెలు తీర్చే స్వామివారు.. తమ సేవలో ఉన్న ఉద్యోగులకు ఎప్పుడు ఊరట నిస్తారో.. అక్రమాలకు ఎలా చెక్ పెడతారో చూడాలి.
తాజావార్తలు
-
PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
-
Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
-
Toxic Trailer: యష్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. ఒక్క ఫోన్ కాల్తో బెంగళూరుకు!
-
Varanasi : సూపర్ స్టార్ బర్త్డే స్పెషల్.. వారణాసి ‘రుద్ర’ ఫస్ట్లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి
-
Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!