మడం తిప్పను, మాటతప్పనన్న జగన్ అన్నమాటను నిలబెట్టుకున్నారని శాసనసభ స్పికర్ కామెంట్స్ తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. గతంలో చోటు చేసుకున్న తిత్లీ తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని పరిహారం అందజేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిత్లీ అదనపు పరిహారం ఇస్తామన్న మాటకు కార్యక్రమం రూపకల్పన చేసారన్నారు.
కులం , మతం , జాతి , జెండా లేదు. తిత్లీ లో నష్టపొయిన అందరికీ పరిహారం అందిస్తున్నామన్నారు. జగన్ గొప్ప మానవతావాది అని, అర్హత కలిగి ఉంటే గత ఎన్నికలలో ఉన్నా పథకాలు అందించాలని సీఎం సూచిస్తున్నారన్నారు. నాకు తెలిసి జగన్ కంటే కమ్యూనిస్ట్ ఎవరు లేరని, ఇలాంటి ముఖ్యమంత్రిని పదికాలలపాటు గెలిపించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతిలేని పాలన , పేదరికం పారదోలటానికి సంక్షేమ, అభివృద్ది కార్యక్రమం అందిస్తున్నారన్నారని ఆయన వెల్లడించారు.