AB PM-JAY: వృద్ధులకు ప్రధాని మోడీ దీపావళి కానుక.. ఏటా 5 లక్షల వరకు..
- ప్రధాని మోడీ వృద్ధులకు దివాలి బహుమతి
- 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు చేయూత
- ఏటా రూ. 5లక్షల వరకు ఉచిత వైద్యం
- ఓకే కుటుంబంలో ఇద్దరు ఉంటే సంగం..సగం వర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వృద్ధులకు దీపావళి బహుమతి అందించారు. 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఏటా రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయాన్ని ప్రవేశ పెట్టారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన’ (PMJAY) కింద తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు రూ.12,850 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరూ ప్రధాన ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత చికిత్స కూడా పొందగలరు. తొమ్మిదవ ఆయుర్వేద దినోత్సవం, హిందూ వైద్య దేవుడైన ధన్వంతరి జన్మదినం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, గర్భిణులు, చిన్నారుల వ్యాక్సినేషన్ కోసం ఉద్దేశించిన యూ-విన్ పోర్టల్ (U-WIN)ను కూడా ప్రారంభించారు.
ఏటా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స..
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద, 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ ఆరోగ్య కవరేజీ లభిస్తుంది. ప్రతి సంవత్సరం రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందుబాటులో ఉంటుంది. దీని వల్ల దేశంలోని 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన 6 కోట్ల మందికి పైగా పెద్దలకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటి వరకు ఈ పథకంలో తక్కువ ఆదాయ వర్గ కుటుంబాలను మాత్రమే చేర్చారు. అయితే వృద్ధుల కోసం ప్రారంభించిన ఈ పథకంలో ఇకపై ఆదాయ పరిమితి ఉండదు. అంతే కాకుండా ఒకే కుటుంబంలో 70 ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం వర్తిస్తుంది.
వృద్ధులకు ఉచిత చికిత్స ఎలా లభిస్తుంది?
ఈ పథకం కోసం.. వృద్ధులకు ప్రత్యేక ఆయుష్మాన్ కార్డు అందించనున్నారు. ఇది కుటుంబ ఆయుష్మాన్ ప్లాన్కు భిన్నంగా ఉంటుంది. అక్టోబర్ 29 నుంచి ఈ ప్రత్యేక కార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పలువురు వృద్ధులకు కార్డులు అందజేశారు. ఈ సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆయుష్మాన్ కార్డ్లు బీఐఎస్ (BIS) పోర్టల్/ఆయుష్మాన్ యాప్ ద్వారా తయారు చేస్తున్నారు. దీని కోసం వృద్ధులు తమ ఆధార్ కార్డ్, కేవైసీ (KYC)ని కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వృద్ధులు ప్రైవేట్, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇన్సూరెన్స్లో ఎంచుకునే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!