Somu Veerraju: అమిత్ షా-ఎన్టీఆర్ భేటీపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: ఏపీలో వినాయక చవితి పండగ సందర్భంగా ఆంక్షలు విధించారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితికి ప్రభుత్వం విధించిన ఆంక్షలు యావత్ ఆంధ్ర ప్రదేశ్ నివ్వెరపోయేలా ఉన్నాయని ఆరోపించారు. ప్రస్తుతం వినాయక చవితికి పందిరి వేసుకుంటే ఫైర్, విద్యుత్, పోలీసుల పర్మిషన్ కావాలని.. చందాలు అడగాలన్నా పర్మిషన్ కావాలని, అసలు ఈ ప్రభుత్వం మనలో పుట్టిందా లేదా అమెరికా నుంచి ఏమైనా వచ్చిందా అనిపిస్తుందని సోము వీర్రాజు చురకలు అంటించారు.
Read Also: Chiranjeevi: ఆ స్థలాన్ని అమ్మేసిన చిరు.. కారణం ఏంటి..?
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
వినాయక చవితి అనాదిగా వచ్చిన పండగని, ఏ రాజకీయ పార్టీ ప్రవేశపెట్టిన పండగ కాదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. నిత్యజీవితంలో వినాయకుని పూజించి ఏ కార్యక్రమమైనా చేస్తామని, అలాంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వినాయక పూజకు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందన్నారు. హిందువులు ఎవరు వినాయక చవితి సరిగా చేయకూడదనే భావన ఈ ప్రభుత్వంలో కనిపిస్తుందన్నారు. ఈ ప్రభుత్వ వైఖరిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఎటువంటి ఆంక్షలు లేకుండా గతంలో లాగా అందరూ పండుగ చేసుకునే విధంగా తమ పార్టీ ధైర్యాన్ని ఇస్తుందన్నారు. మరోవైపు ఇటీవల హైదరాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీపై సోము వీర్రాజు స్పందించారు. రాజకీయాలలో ఏదైనా జరగొచ్చని, పార్టీ వ్యూహత్మకంగా వెళ్లే విషయంలో అనేక కార్యక్రమాలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీని అభివృద్ధి చేయాలనేది కేంద్ర పార్టీ లక్ష్యమని, కేంద్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న పార్టీ కార్యకర్తలుగా, సైనికులుగా పనిచేస్తూ ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!