Teachers: స్కూళ్లలో నేటి నుంచి కొత్త విధానం.. లేట్ అయితే అంతే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సర్కారీ బడుల రూపరేఖల్ని మార్చేస్తున్న జగన్ సర్కార్… విద్యార్థులకు మెరుగైన విద్య అందేందుకు చర్యలు చేపడుతోంది. టీచర్లు రోజూ స్కూల్కు రావడమే కాదు… సమయపాలన పాటించేలా చేస్తోంది. దీనికోసం నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ యాప్ను ఉపయోగించబోతోంది. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తోంది ఏపీ సర్కార్. ఇప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కూడా నడుం కట్టింది. టీచర్లకు ప్రత్యేకంగా తయారు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ యాప్ను ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్ వైఎస్ జగన్మోహన్రెడ్డి..
Read Also: TTD Hundi Collection New Record: రికార్డు సృష్టించిన శ్రీవారి హుండీ..
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ళు, విద్యాశాఖలోని బోధన, బోధనేతర సిబ్బంది కొత్త అటెండెన్స్ విధానం అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు థంబ్ ఇంప్రెషన్ ద్వారా వీరందరి బయో మెట్రిక్ అటెండెన్స్ నమోదయ్యేది. ఇకపై మరింత మెరుగైన, భద్రమైన ఫేషియల్ రికగ్నీషన్ అటెండెన్స్ నమోదవుతుంది. విద్యార్థులకు మంచి చదువు అందాలంటే మాత్రం అది ఉపాధ్యాయులపైనే ఆధారపడుతుంది. కానీ… సర్కారీ బడుల్లో టీచర్లు వేళకు రావడం లేదని, వచ్చినా పూర్తి సమయం ఉండడం లేదా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో టీచర్లు స్కూళ్లకు నిర్ణీత సమయానికి వస్తున్నారా? లేదా? ఎంత సమయం స్కూల్లో ఉంటున్నారు వంటి అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి కొత్త మొబైల్ యాప్ ఉపయోగపడుతుంది. పాఠశాల విద్యాశాఖ ఆధీనంలో పనిచేస్తున్న భోధనేతర సిబ్బంది కూడా ఈ యాప్ ద్వారానే హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే, ఇవాళ్టీ నుంచి యాప్ ద్వారానే అటెండెన్స్ వేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా.. అటెండెన్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకునే ప్రసక్తే లేదంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. యాప్ ఆధారిత హాజరుపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రేపటి నుంచి మొత్తం యాప్లను డౌన్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.. మరోవైపు, వైద్యారోగ్య శాఖ సిబ్బందికి ప్రభుత్వమే పరికరాలు కొనుగోలు చేసిచ్చినట్లుగా విద్యాశాఖకు ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.. ఇక, ఈ పరిస్థితుల నేపథ్యంలో.. ఉపాధ్యాయ సంఘాలతో ఈ రోజు సాయంత్రం చర్చలు జరపున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?