Teachers: స్కూళ్లలో నేటి నుంచి కొత్త విధానం.. లేట్ అయితే అంతే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సర్కారీ బడుల రూపరేఖల్ని మార్చేస్తున్న జగన్ సర్కార్… విద్యార్థులకు మెరుగైన విద్య అందేందుకు చర్యలు చేపడుతోంది. టీచర్లు రోజూ స్కూల్కు రావడమే కాదు… సమయపాలన పాటించేలా చేస్తోంది. దీనికోసం నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ యాప్ను ఉపయోగించబోతోంది. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తోంది ఏపీ సర్కార్. ఇప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కూడా నడుం కట్టింది. టీచర్లకు ప్రత్యేకంగా తయారు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ యాప్ను ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్ వైఎస్ జగన్మోహన్రెడ్డి..
Read Also: TTD Hundi Collection New Record: రికార్డు సృష్టించిన శ్రీవారి హుండీ..
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
- Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ళు, విద్యాశాఖలోని బోధన, బోధనేతర సిబ్బంది కొత్త అటెండెన్స్ విధానం అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు థంబ్ ఇంప్రెషన్ ద్వారా వీరందరి బయో మెట్రిక్ అటెండెన్స్ నమోదయ్యేది. ఇకపై మరింత మెరుగైన, భద్రమైన ఫేషియల్ రికగ్నీషన్ అటెండెన్స్ నమోదవుతుంది. విద్యార్థులకు మంచి చదువు అందాలంటే మాత్రం అది ఉపాధ్యాయులపైనే ఆధారపడుతుంది. కానీ… సర్కారీ బడుల్లో టీచర్లు వేళకు రావడం లేదని, వచ్చినా పూర్తి సమయం ఉండడం లేదా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో టీచర్లు స్కూళ్లకు నిర్ణీత సమయానికి వస్తున్నారా? లేదా? ఎంత సమయం స్కూల్లో ఉంటున్నారు వంటి అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి కొత్త మొబైల్ యాప్ ఉపయోగపడుతుంది. పాఠశాల విద్యాశాఖ ఆధీనంలో పనిచేస్తున్న భోధనేతర సిబ్బంది కూడా ఈ యాప్ ద్వారానే హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే, ఇవాళ్టీ నుంచి యాప్ ద్వారానే అటెండెన్స్ వేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా.. అటెండెన్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకునే ప్రసక్తే లేదంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. యాప్ ఆధారిత హాజరుపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రేపటి నుంచి మొత్తం యాప్లను డౌన్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.. మరోవైపు, వైద్యారోగ్య శాఖ సిబ్బందికి ప్రభుత్వమే పరికరాలు కొనుగోలు చేసిచ్చినట్లుగా విద్యాశాఖకు ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.. ఇక, ఈ పరిస్థితుల నేపథ్యంలో.. ఉపాధ్యాయ సంఘాలతో ఈ రోజు సాయంత్రం చర్చలు జరపున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
-
Raaka : ‘రాకా’లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
-
Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
-
Acer Swift Neo AI Laptop: Acer Swift Neo AI ల్యాప్టాప్ రిలీజ్.. 32GB RAM, 1TB SSDతో అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే
-
Nagarjuna: బర్త్డే వేళ నాగార్జున ఫ్యాన్స్కు షాక్.. నెట్ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!