Sankranti 2026: బాదుడే బాదుడు.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు మొదలైన ‘సంక్రాంతి’ పండుగ!
- ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు మొదలైన సంక్రాంతి
- సొంత ఊరికి ప్రయాణించాలంటే ఓ నెల జీతం సరిపోదేమో
- 2-3 రెట్లు ధర పెంచేసి టికెట్ల విక్రయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సంక్రాంతి’ లాంటి పెద్ద పండుగలు వచ్చాయంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్ బస్సుల నిర్వాహకులకు మొదలవుతుంది అసలు పండుగ. పండక్కి సకుటుంబ సమేతంగా సొంత ఊర్లకు వెళ్లాలంటే ట్రైన్ల తర్వాత బస్సులే దిక్కు. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, చిన్నో పెద్ద పని చేసుకుంటూ బతుకుతున్న కుటుంబాలు సంక్రాంతికి సొంత ఊరికి ప్రయాణించాలంటే ఓ నెల జీతం సరిపోదేమో. సాధారణ రోజుల కంటే పండగ సమయాల్లో 2-3 రెట్లు ధర పెంచేసి టికెట్లు విక్రయిస్తారు.
ఆర్టీసీలో సరిపడా సర్వీసులు ఉండకపోవడంతో.. ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తుంటారు. ఇదే అదునుగా రిజర్వేషన్లు, బుకింగ్ల పేరుతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిలువ దోపిడీకి పాల్పడుతోంది. విశాఖ-హైదరాబాద్, హైదరాబాద్-విశాఖకు వెళ్లాలంటే సాధారణ రోజుల్లో టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అదే పండగ సమయంలో ఆరు వేల నుంచి 8 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. వీటన్నిటికీ భయపడి నెల రోజుల ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకుంటున్నారు ప్రయాణికులు. అయినా కూడా ప్రయాణికులపై బాదుడు భారం తప్పడం లేదు.
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
Also Read: AP Farmers: ఓవైపు తుఫాన్లు, మరోవైపు ధరలు.. అల్లాడిపోతున్న రైతులు!
సంక్రాంతి పండగకి ఇంకా నెల రోజులే ఉంది. సెలవులకు సొంత ఊళ్లకు వెళ్ళడానికి ఇప్పటికే ప్లాన్ వేసుకుంటున్నారు ప్రజలు. అయితే ఫ్యామిలీలతో పండక్కి ఊరెళ్ళి తిరిగి రావడం ఆషామాషీ కాదు. సంక్రాంతి పండగ ఏమో కానీ జర్నీ విషయానికొస్తేనే గుండె గుబేలు మనేలా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. రానుపోను ప్రయాణాలు పెద్ద సమస్యగా మారింది. విశాఖ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు.. ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర వైపు వచ్చే వాళ్ళు రెండు నెలలు ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. ఫస్ట్ ప్రియారిటి ట్రైన్ జర్నీకి ఇచ్చినప్పటికీ రిజర్వేషన్లు టికెట్స్ కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రస్తుతానికి 30 వరకు ట్రైన్లు నడుస్తున్నాయి. రెగ్యులర్ ట్రైన్స్ తో పాటు వీక్లీ ట్రైన్స్ కూడా దాదాపుగా రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సరిపడా ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప.. సాఫీగా ప్రయాణం చేసేటట్టు కనిపించడం లేదు.
తాజావార్తలు
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?