Samajika NyayaBheri: మంత్రుల బస్సు యాత్ర ముగిసింది… నెక్స్ట్ ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇవాళ్టితో మూడేళ్లు పూర్తయింది. ఈ మూడేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై జగన్ ఫోకస్ పెట్టనున్నారు. మూడేళ్ళ పాలనా సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు. తాడేపల్లి పార్టీ హెడ్ క్వార్టర్స్ లో సంబరాలు, పలు సేవా కార్యక్రమాలు చేపడతారు. వీటికి సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి, ఇతర నేతలు హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు సంబరాలు నిర్వహించనున్నారు.
బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేయబోతోందన్నది ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏపీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి యాత్ర ఆదివారం నాడు ముగిసింది. ఓవైపు సంక్షేమాన్ని వివరిస్తూనే… విపక్షాలపై విసుర్లతో విరుచుకుపడ్డారు మంత్రులు. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర శ్రీకాకుళంతో మొదలై అనంతపురంతో ముగిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పధకాల్ని 4 రోజుల పాటు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు మంత్రులు. అడగడుగునా సంప్రదాయ రీతిలో స్వాగతాలు లభించాయి. 17 మంది మంత్రులు ఒకేచోట కనిపించడం విశేషం.
Also Read
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
పలు జిల్లాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రధానంగా సంక్షేమంపైనే ఫోకస్ చేస్తూ… గతంలో ఏం ఒరిగింది? ఇప్పుడు ఏం జరిగింది? అనే విషయం చెప్పుకొచ్చారు మంత్రులు. మరోవైపు మహానాడులో టీడీపీ చేసిన విమర్శలకు కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీ హయాంలో కేవలం ఆ పార్టీ కార్యకర్తలకే పధకాలు అందాయని… జగన్ పాలనలో పార్టీలు, కులాలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని గుర్తు చేశారు. అటు వైసీపీ హయాంలో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని చంద్రబాబు అంటే… అదే స్థాయిలో మంత్రులు కూడా విరుచుకుపడ్డారు. బాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నదానికి అంతే లేదని… ఆయన కుట్రల్ని తిప్పికొట్టాలని మంత్రులు పిలుపునిచ్చారు.
‘టీడీపీది మహానాడు కాదని… వెన్నుపోటు నాడు, మహాస్మశానం, ఏడుపునాడు, దగా నాడంటూ మండిపడ్డారు మంత్రులు. నవరత్నాల పథకాలతో సీఎం జగన్.. పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చారన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన బాబు మళ్లీ అధికారంలోకి రావడం కలేనని జోస్యం చెప్పారు మంత్రులు. ఇలా శ్రీకాకుళంలో ప్రారంభమైన మంత్రుల సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర అనంతపురంలో జరిగిన బహిరంగ సభతో ముగిసింది. ఓవైపు సంక్షేమాన్ని ప్రస్తావిస్తూనే… ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై విమర్శల దాడి చేసిన మంత్రులు… ఈ టూర్ సక్సెస్ అయిందన్న భావనలో ఉన్నారు. దీనిపై సీఎం జగన్ కి వివరించాక తదుపరి కార్యాచరణకు దిగనున్నారు మంత్రులు. రాబోయే రోజుల్లో పార్టీని మరింతగా జనంలోకి తీసుకెళ్ళనున్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!