Sajjala Ramakrishnudu: 175కి 175 స్థానాలు గెలిచే దిశగా పని చేయాలి.. టెలి కాన్ఫరెన్స్లో సజ్జల
Sajjala Ramakrishna Reddy Tele Conference Meeting With Party Observers: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం 175 నియోజకవర్గాల పార్టీ పరిశీలకులతో టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సూచనలు సూచించారు. ఎన్నికల ఏడాదిలో పార్టీ పరిశీలకులు కీలకంగా వ్యవహరించాలని.. వారంలో కనీసం రెండు రోజులు నియోజకవర్గాల్లో ఉండి పని చేయాలని అన్నారు. పార్టీ పరిశీలకులపై సీఎం వైఎస్ జగన్ ఎంతో నమ్మకం, విశ్వాసంతో ఉన్నారన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలకు సంధానకర్తలుగా పని చేయాలని చెప్పారు. జగనన్న సురక్ష, ఓటర్ల జాబితా సవరణ, దొంగ ఓట్లు తొలగింపు, అర్హులైన వారిని ఓటర్లుగా చేర్పించే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. నియోజకవర్గాలలో నెలకొనే సమస్యలు, పార్టీ అంతర్గత వ్యవహారాల విషయాలలో అధిష్టానం తరపున సమన్వయం చేయాలన్నారు. 175 నియోజకర్గాలకు 175 స్థానాలు గెలిచే దిశగా పని చేయాలన్నారు. దాదాపు 68 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని తేలిందని.. వాటిని వెంటనే గుర్తించి తొలగించాలని దిశానిర్దేశం చేశారు.
Taneti Vanitha: దళితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంది వైసీపీ ప్రభుత్వమే
Also Read
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
అంతకుముందు.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లపై సజ్జల ధ్వజమెత్తారు. పవన్ అసలు రాజకీయ నాయకుడే కాదని విమర్శించారు. సినిమా నటుడు కాబట్టే.. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ని చదువుతాడని ఎద్దేవా చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ అంటున్నారని, అక్కడే ఆయనొక పెయిడ్ ఆర్టిస్ట్ అని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. పవన్తో పాటు ఇతర నాయకులందరికీ.. రాజకీయ అజెండా మొత్తం చంద్రబాబు, ఎల్లో మీడియా వద్దే రెడీ అవుతుందన్నారు. దాన్ని మోయడమే వారి పని అని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమం చేపట్టినా.. చంద్రబాబుకు, పవన్ కల్యాణ్కు మింగుడుపడదని అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసమే తాను పనిచేస్తున్నానని పవన్ కల్యాణ్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే.. పవన్ దివాళాకోరుతనం అర్థమైపోయిందని విరుచుకుపడ్డారు.
Bihar: పెళ్లి వేడుకలో మైక్ లో పాట పాడుతూ మహిళ మృతి.. ఏమైందంటే?
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
-
Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!