Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు చేసిన స్కాంలు ఆధారాలతో సహా బయటకు వస్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy On Chandrababu Karakatta House Issue: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి కృష్ణానది కరకట్టపై చంద్రబాబు అద్దెకు ఉన్న లింగమనేని నివాసం జప్తపై ఏసీబీ కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ఇంటిని జప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ని విచారించిన ఏసీబీ కోర్టు.. ఇంటి జప్తునకు అనుమతించింది. అలాగే.. లింగమనెని రమేష్తో పాటు మిగతా ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఇదే సమయంలో.. మాజీ మంత్రి నారాయణకు చెందిన ఆస్తుల పాక్షిక జప్తునకు కూడా ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే.. జప్తు వ్యవహరంతో తమకేం సంబంధం లేదని టీడీపీ పేర్కొంది. తాను నివాసం ఉంటున్న ఇంటికి చంద్రబాబు అద్దె చెల్లిస్తున్నారని టీడీపీ వెల్లడించింది.
Bandi Sanjay: గోమాతను వధిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?..ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తారా?
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
ఈ నేపథ్యంలోనే.. లింగమనేని ఇంటికి చంద్రబాబు అద్దె చెల్లిస్తే, ఆ ఆధారాలను బయటపెట్టాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు, లింగమనేనికి మధ్య ఏం ఒప్పందం జరిగిందో మీడియాకు వెల్లడించాలని కోరారు. ఒక పరిశోధన సంస్థ.. ప్రాధమిక ఆధారాలతోనే చంద్రబాబు నివాసాన్ని జప్తు చేసిందని ఆయన వెల్లడించారు. ప్రాధమిక ఆధారాలను బట్టి సంతృప్తి చెందటం వల్లే, జప్తుకు కోర్టు అనుమతి ఇచ్చిందన్నారు. పెద్ద నోరు పెట్టుకుని మాట్లాడితే.. అబద్దాలు నిజాలు అయిపోతాయన్నట్లు టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కుంభకోణమే జరుగలేదు అనుకుంటే.. టీడీపీ ఎందుకు భయపడుతోంది? అని నిలదీశారు. చంద్రబాబు తన హయాంలో లింగమనేని ఇల్లు ప్రభుత్వానికి ఇచ్చినట్లు చెప్పటం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
Krithi Shetty: చిట్టి నడుముతో, ఎల్లో శారీలో గుండెలు కోస్తున్న కృతి శెట్టి
రాజకీయ కక్ష సాధింపు చేయాలనుకుంటే.. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరిని కేసుల్లో ఇరికించి, లోపల వేసి ఉండే వారని సజ్జల హెచ్చరించారు. కానీ, తాము అలా చేయలేదన్నారు. తగిన ఆధారాల సేకరించిన తర్వాతే విచారణ జరుగుతోంద్నారు. ఈ స్కాం చంద్రబాబు తలలో పుట్టిన ఆలోచనల నుంచి వచ్చిందని ఆరోపించారు. ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ మార్పు చేసినట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని.. టీడీపీ ఆరోపణల్ని తిప్పికొట్టారు. ఈ మొత్తం కుంభకోణంలో లింగమనేని ఇల్లు టిప్ ఆఫ్ ది ఐస్ బర్గ్ అని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో అప్పటి మంత్రి నారాయణ లింక్గా వ్యవహరించాన్నారు. అధికార దుర్వినియోగానికి ఈ కేసు నిఖార్సైన ఉదాహరణ అని చెప్పిన సజ్జల.. చంద్రబాబు చేసిన స్కాంలు ఆధారాలతో సహా బయటకు వస్తాయ్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!