Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు చేసిన స్కాంలు ఆధారాలతో సహా బయటకు వస్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy On Chandrababu Karakatta House Issue: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి కృష్ణానది కరకట్టపై చంద్రబాబు అద్దెకు ఉన్న లింగమనేని నివాసం జప్తపై ఏసీబీ కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ఇంటిని జప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ని విచారించిన ఏసీబీ కోర్టు.. ఇంటి జప్తునకు అనుమతించింది. అలాగే.. లింగమనెని రమేష్తో పాటు మిగతా ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఇదే సమయంలో.. మాజీ మంత్రి నారాయణకు చెందిన ఆస్తుల పాక్షిక జప్తునకు కూడా ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే.. జప్తు వ్యవహరంతో తమకేం సంబంధం లేదని టీడీపీ పేర్కొంది. తాను నివాసం ఉంటున్న ఇంటికి చంద్రబాబు అద్దె చెల్లిస్తున్నారని టీడీపీ వెల్లడించింది.
Bandi Sanjay: గోమాతను వధిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?..ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తారా?
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
ఈ నేపథ్యంలోనే.. లింగమనేని ఇంటికి చంద్రబాబు అద్దె చెల్లిస్తే, ఆ ఆధారాలను బయటపెట్టాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు, లింగమనేనికి మధ్య ఏం ఒప్పందం జరిగిందో మీడియాకు వెల్లడించాలని కోరారు. ఒక పరిశోధన సంస్థ.. ప్రాధమిక ఆధారాలతోనే చంద్రబాబు నివాసాన్ని జప్తు చేసిందని ఆయన వెల్లడించారు. ప్రాధమిక ఆధారాలను బట్టి సంతృప్తి చెందటం వల్లే, జప్తుకు కోర్టు అనుమతి ఇచ్చిందన్నారు. పెద్ద నోరు పెట్టుకుని మాట్లాడితే.. అబద్దాలు నిజాలు అయిపోతాయన్నట్లు టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కుంభకోణమే జరుగలేదు అనుకుంటే.. టీడీపీ ఎందుకు భయపడుతోంది? అని నిలదీశారు. చంద్రబాబు తన హయాంలో లింగమనేని ఇల్లు ప్రభుత్వానికి ఇచ్చినట్లు చెప్పటం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
Krithi Shetty: చిట్టి నడుముతో, ఎల్లో శారీలో గుండెలు కోస్తున్న కృతి శెట్టి
రాజకీయ కక్ష సాధింపు చేయాలనుకుంటే.. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరిని కేసుల్లో ఇరికించి, లోపల వేసి ఉండే వారని సజ్జల హెచ్చరించారు. కానీ, తాము అలా చేయలేదన్నారు. తగిన ఆధారాల సేకరించిన తర్వాతే విచారణ జరుగుతోంద్నారు. ఈ స్కాం చంద్రబాబు తలలో పుట్టిన ఆలోచనల నుంచి వచ్చిందని ఆరోపించారు. ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ మార్పు చేసినట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని.. టీడీపీ ఆరోపణల్ని తిప్పికొట్టారు. ఈ మొత్తం కుంభకోణంలో లింగమనేని ఇల్లు టిప్ ఆఫ్ ది ఐస్ బర్గ్ అని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో అప్పటి మంత్రి నారాయణ లింక్గా వ్యవహరించాన్నారు. అధికార దుర్వినియోగానికి ఈ కేసు నిఖార్సైన ఉదాహరణ అని చెప్పిన సజ్జల.. చంద్రబాబు చేసిన స్కాంలు ఆధారాలతో సహా బయటకు వస్తాయ్నారు.
తాజావార్తలు
-
TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
-
TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్కు రేపటివరకు గవర్నర్ డెడ్లైన్..
-
Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల
-
Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు
-
Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!