Sajjala Ramakrishna Reddy: ఏంటి ఆ బరి తెగింపు..? పవన్లా చంద్రబాబుకు కూడా ఆ కోరిక ఉన్నట్లుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు.. పోలీసులు, వైసీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు.. అయితే, చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. కర్నూలులో చంద్రబాబు విన్యాసాలను ప్రజలు అందరూ చూశారన్న ఆయన.. ముఖ్యమంత్రి, పార్టీ నేతల మీద చివరకు ప్రజల మీద కూడా బూతులతో దాడి చేశారని విమర్శించారు.. చంద్రబాబుకు ఎందుకు అంత కోపం వచ్చింది? అని ప్రశ్నించిన ఆయన.. పవన్ కల్యాణ్ కూడా ఆ మధ్య పూనకం వచ్చినట్టు ఊగిపోయారు.. పవన్ కల్యాణ్ లా చంద్రబాబుకు కూడా చెప్పు చూపించాలని కోరిక ఉన్నట్లు ఉంది అంటూ ఎద్దేవా చేశారు.. న్యాయ రాజధానిపై మీ విధానం ఏంటి అని సీమ ప్రజలు, పౌర సమాజం చంద్రబాబును నిలదీసిందని.. ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. అప్పుడే నాయకులు అవుతారు? అమరావతిలోనే కేంద్రీకృత రాజధాని ఎందుకు అవసరమో ప్రజలకు చెప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చింది.. కానీ, చంద్రబాబు మాత్రం ఊగిపోయారని మండిపడ్డారు.
Read Also: Manika Batra: మనిక బాత్రా రికార్డు.. ఆసియా కప్ టీటీ ఈవెంట్లో కాంస్యం
Also Read
- YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
- TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
- YS Jagan: సుగాలి ప్రీతి కేసుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
- Mega DSC 2025: మెగా డీఎస్సీ-2025పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు.. పాఠశాల విద్యాశాఖ తీవ్ర హెచ్చరిక
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వికేంద్రీకరణ అభివృద్ధి జరిగి ఉంటే రాష్ట్ర విభజన ఇంత చేదుగా ఉండేది కాదన్నారు సజ్జల.. అమరావతిలో చంద్రబాబు చెప్పే లక్ష కోట్ల రాజధాని కట్టడం అసాధ్యం.. అమరావతి ఒక భ్రమ అని స్పష్టం చేశారు. రౌడీలకు రౌడీని అనే వ్యాఖ్యలు ఏంటి? చంద్రబాబుకు అంత బరి తెగింపు ఏంటి? అని మండిపడ్డారు.. టీడీపీ అంటే తిట్లు, దూషణలు, పచ్చి బూతులు.. వాళ్లే దాడి చేసి వాళ్లే బట్టలు చించుకుని బయటకు వచ్చి అరుస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, చిట్ ఫండ్స్ లో అక్రమాలను పెట్టుకుంటే కక్ష సాధింపు అంటారు.. మీరు అన్నింటికీ అతీతమా? అని ప్రశ్నించారు.. వచ్చే ఎన్నికలు ప్రజలకు చివరి అవకాశమని మాట్లాడుతున్నారు.. ఇదేం కర్మ రా బాబు అని చెబితే సరిగ్గా సరిపోతుంది.. తన హయాంలో ప్రజలకు నిజంగా మంచి చేసి ఉంటే అదే చెప్పుకోవచ్చు.. ఏమీ చేయలేదు కనుకే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చో బెట్టారని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
అమరావతిలోనే రాజధాని ఉండాలని వైఎస్ జగన్ ఎప్పుడూ చెప్పలేదన్నారు సజ్జల.. అప్పుడు చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు.. చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం రాజధాని పూర్తి చేసి ఉంటే అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుని ఉండేవారన్నారు.. రాష్ట్ర బడ్జెట్ అంతా ఈ 29 గ్రామాల్లోనే పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. చంద్రబాబు ఒక్కడే నాయకుడు మిగిలిన పార్టీలన్నీ ఉడతలనా అర్థం? అంటూ ఫైర్ అయ్యారు.. వారి మాటల్లోనే అహంకారం కనిపిస్తోంది.. ఉడతలన్నీ కష్టపడి చంద్రబాబును పల్లకీలో కూర్చోబెట్టాలా? అని నిలదీశారు.. అసలు వికేంద్రీకరణ పై చంద్రబాబు స్టాండ్ ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
-
YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
-
Vishwambhara : అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
-
TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
-
August Box Office: టాలీవుడ్లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్లు.. నాని Vs రవితేజ Vs శర్వా!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!