Nadendla Manohar: రైతు భరోసా కేంద్రాలు.. రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bhorosa Kendras Are Biggest Scam In AP Says Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం.. రైతు భరోసా కేంద్రాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెనాలీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో మొత్తం 10,700 రైతు భరోసా కేంద్రాలున్నాయని, వాటన్నింటిలోనూ అవినీతి జరుగుతోందని విజిలెన్స్ నివేదిక వెల్లడించిందని పేర్కొన్నారు. రైతుల వద్ద లంచాలు తీసుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని.. ఈ-క్రాప్ కోసం కూడా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని, తూకాల్లో రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులు.. రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత రైతులకు కులాల వారీగా గుర్తిస్తున్నారని మండిపడ్డారు. అటు.. గంజాయి కేసుల్లో కూడా పెద్ద తలకాయల్ని పక్కన పెట్టేసి, చిన్నవాళ్లని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారన్నారు. గంజాయి నిర్మూలన చేస్తున్నందుకే గత డీజీపీని తొలగించారని పేర్కొన్నారు.
అంతకుముందు.. ఇళ్ల నిర్మాణంలోనూ పేదలకు వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. ఇది ‘జగనన్న ఇళ్లు గుల్ల పథకం’ అని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు ఇసుకను బ్లాక్లో అమ్ముకుంటున్నారని తెలిపారు. పేదలకు ఇళ్ల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానిది దోబూచులాట అని.. గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న కాలనీలు, పట్టణ ప్రాంతాల్లో టిడ్కో గృహాలు అర్హులైన పేదలకు చెందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసేశారు. దీని వెనుక ఉన్న అసలు కారణాల్ని ప్రజలకు తెలియజేసేందుకు జనసేన నడుం బిగించిందని.. క్షేత్ర స్థాయిలో ఇల్లు కట్టుకునేందుకు పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, జగనన్న కాలనీల పరిస్థితి ఎలా ఉందో తాము బయట పెడతామని హెచ్చరించారు. ఈ విషయాలపై నవంబర్ 12, 13, 14 తేదీల్లో జనసేన ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ నిర్వహిస్తామని తెలియజేశారు.
Also Read
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- CM Chandrababu: 'స్వర్ణ కుప్పం విజన్ 2029'కు శ్రీకారం.. కుప్పం రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్పై సీఎం సమీక్ష
- 116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
- Kandula Durgesh: "మీ అక్రమ సంబంధం నాకు తెలుసు".. ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
-
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
-
Vijay Deverakonda: సేవా కార్యక్రమాలతో మరోసారి మనసులు గెలిచిన విజయ్.. రాజకీయాలపై కొత్త చర్చకు కారణమయ్యారా?
-
Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసు..!
-
Bhadra Rajyoga 2026: జూలై 7 నుంచి ఈ మూడు రాశుల అదృష్టం మారనుందా? బుధుడి సంచారం వల్ల ఎవరికి ఎక్కువ లాభం?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!