Nadendla Manohar: రైతు భరోసా కేంద్రాలు.. రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bhorosa Kendras Are Biggest Scam In AP Says Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం.. రైతు భరోసా కేంద్రాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెనాలీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో మొత్తం 10,700 రైతు భరోసా కేంద్రాలున్నాయని, వాటన్నింటిలోనూ అవినీతి జరుగుతోందని విజిలెన్స్ నివేదిక వెల్లడించిందని పేర్కొన్నారు. రైతుల వద్ద లంచాలు తీసుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని.. ఈ-క్రాప్ కోసం కూడా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని, తూకాల్లో రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులు.. రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత రైతులకు కులాల వారీగా గుర్తిస్తున్నారని మండిపడ్డారు. అటు.. గంజాయి కేసుల్లో కూడా పెద్ద తలకాయల్ని పక్కన పెట్టేసి, చిన్నవాళ్లని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారన్నారు. గంజాయి నిర్మూలన చేస్తున్నందుకే గత డీజీపీని తొలగించారని పేర్కొన్నారు.
అంతకుముందు.. ఇళ్ల నిర్మాణంలోనూ పేదలకు వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. ఇది ‘జగనన్న ఇళ్లు గుల్ల పథకం’ అని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు ఇసుకను బ్లాక్లో అమ్ముకుంటున్నారని తెలిపారు. పేదలకు ఇళ్ల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానిది దోబూచులాట అని.. గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న కాలనీలు, పట్టణ ప్రాంతాల్లో టిడ్కో గృహాలు అర్హులైన పేదలకు చెందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసేశారు. దీని వెనుక ఉన్న అసలు కారణాల్ని ప్రజలకు తెలియజేసేందుకు జనసేన నడుం బిగించిందని.. క్షేత్ర స్థాయిలో ఇల్లు కట్టుకునేందుకు పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, జగనన్న కాలనీల పరిస్థితి ఎలా ఉందో తాము బయట పెడతామని హెచ్చరించారు. ఈ విషయాలపై నవంబర్ 12, 13, 14 తేదీల్లో జనసేన ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ నిర్వహిస్తామని తెలియజేశారు.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
తాజావార్తలు
-
TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
-
TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్కు రేపటివరకు గవర్నర్ డెడ్లైన్..
-
Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల
-
Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు
-
Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!