Robbery in Prakasam District: పొదిలిలో దారి దోపిడీ.. అటు వెళ్లాలంటేనే హడల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగలు రెచ్చిపోతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో జరిగిన దారిదోపిడీ సంచలనంగా మారింది. హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే అనుకుని రామాపురం వెళ్లే గురుగుపాడు మట్టిరోడ్డులో దారి దోపిడీకి ప్రయత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. రాత్రి సమయాలలో గురుగుపాడు గ్రామానికి వెళ్తున్న వాహనాలను ఆపి బెదిరింపులకు పాల్పడుతున్నారని గుర్తు తెలియని ముఠాపై పలువురు ఆరోపిస్తున్నారు ఆటో ఆపి ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తిని బెదిరించడంతో ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు బాధితుడు.
అయితే, అతని దగ్గర నగదు లేకపోవడంతో బాధితుడిని వదిలేసారు దుండగులు. దారిదోపిడీ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అక్కడేం జరిగిందనేది ఆరాతీస్తున్నారు. ఈ ఘటనతో వాహనదారులు ఆ దారిలో వెళ్లాలంటేనే భయాందోళనకు గురి అవుతున్నారు.ఈ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ అధికారులు స్పందించి ఇలాంటి దారి దోపిడీ బెదిరింపులకు ప్రయత్నిస్తున్న ముఠా సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. వాహనదారులపై ఎటువంటి దాడులు జరగకుండా చూడాలని పలువురు పోలీసులకు సూచిస్తున్నారు. ఈ ప్రాంతంలో పోలీస్ గస్తీ ఏర్పాటుచేయాలంటున్నారు.
Also Read
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
Read ALso: Alien Birth: బీహార్లో వింత శిశువు జననం.. చూసేందుకు ఎగబడుతున్న జనం
కడియద్ద బాధితులకు చెక్కుల పంపిణీ
ఈ నెల 10వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో జరిగిన బాణసంచా కర్మాగార పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఘటనలో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు కుటుంబానికి 10లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను అందచేశారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి. దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ. ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ప్రమాదం జరిగి వారం రోజులు నిండకుండానే బాధితులను ఆదుకోవడం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సాధ్యం అయింది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..