Revanth Reddy: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకం కావాలని కోరుకున్నా.. శ్రీవారి సేవలో రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకం కావాలని స్వామిని కోరుకున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి ప్రసాదం సెలవు సందర్భంగా రేవంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని స్వామి కోరుకున్నానని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య మానవ సంబంధాలు, ఆర్థిక, రాజకీయ సంబంధాలు బాగుండాలని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకం కావాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల అవినీతికి కేసీఆర్ కుటుంబమే కారణమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ఈరోజు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అవినీతి ఫలితమే మేడిగడ్డ ప్రాజెక్టు అని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే ధర్మపురి ప్రాంతం సంపద పొంది అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఆరు హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మార్పు రావాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Also Read
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
- Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
- Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
- Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు చికిత్స.. రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం..
🔥ధర్మపురి..
కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాంతానికి నిధులు వచ్చాయి.. అభివృద్ధి జరిగింది.
కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైంది.సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన ప్రతీ అవినీతికి కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది.
తెలంగాణలో మార్పు… pic.twitter.com/tC2ENDSilD
— Revanth Reddy (@revanth_anumula) November 12, 2023
మరోవైపు కలియుగ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరి కిటకిటలాడింది. నిన్న 71,690 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 24,993 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3.87 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆదివారం స్వామివారి దర్శనం కోసం 21 కోచ్లు వేచి ఉన్నాయి. 8 గంటల్లో అందరి దర్శనం జరుగుతుందని వివరించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తున్నందున బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆస్థానం కారణంగా కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవలను రద్దు చేసి అర్చన, తోమాల సేవలు వేర్వేరుగా నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Musi Riverfront Project: రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతి.. 21 కి.మీ. మేర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్.!
-
CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
-
Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
-
Agadha:14 మిలియన్ వ్యూస్తో సంచలనం.. ఎంఎస్ రాజు ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో విభేదాల చర్చ.. మాజీమంత్రిపై మంత్రి ఫిర్యాదు.!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!