Revanth Reddy: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకం కావాలని కోరుకున్నా.. శ్రీవారి సేవలో రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకం కావాలని స్వామిని కోరుకున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి ప్రసాదం సెలవు సందర్భంగా రేవంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని స్వామి కోరుకున్నానని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య మానవ సంబంధాలు, ఆర్థిక, రాజకీయ సంబంధాలు బాగుండాలని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకం కావాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల అవినీతికి కేసీఆర్ కుటుంబమే కారణమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ఈరోజు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అవినీతి ఫలితమే మేడిగడ్డ ప్రాజెక్టు అని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే ధర్మపురి ప్రాంతం సంపద పొంది అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఆరు హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మార్పు రావాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Also Read
- AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- CM Chandrababu: అమరావతి అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ-గుంటూరుతో కలిసి అభివృద్ధి..
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Real Estate Scam: శ్రీవారి వీవీఐపీ దర్శనం పేరుతో రియల్ ఎస్టేట్ మోసం?..
🔥ధర్మపురి..
కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాంతానికి నిధులు వచ్చాయి.. అభివృద్ధి జరిగింది.
కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైంది.సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన ప్రతీ అవినీతికి కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది.
తెలంగాణలో మార్పు… pic.twitter.com/tC2ENDSilD
— Revanth Reddy (@revanth_anumula) November 12, 2023
మరోవైపు కలియుగ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరి కిటకిటలాడింది. నిన్న 71,690 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 24,993 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3.87 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆదివారం స్వామివారి దర్శనం కోసం 21 కోచ్లు వేచి ఉన్నాయి. 8 గంటల్లో అందరి దర్శనం జరుగుతుందని వివరించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తున్నందున బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆస్థానం కారణంగా కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవలను రద్దు చేసి అర్చన, తోమాల సేవలు వేర్వేరుగా నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!