Mali: షాకింగ్.. తెలంగాణ యువకుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mali: బాగా సంపాదించి జీవితాన్ని మెరుగుపర్చుకోవాలి.. కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలనే ఆశతో విదేశానికి వెళ్ళిన ఓ తెలంగాణ యువకుడు అనుకోని ప్రమాదంలో ఇరుక్కున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్ గత ఏడాది ఉద్యోగ బాధ్యతల నిమిత్తం ఆఫ్రికా ఖండంలోని మాలి దేశానికి వెళ్లాడు. బోర్వెల్ ప్రాజెక్టుల పర్యవేక్షణే అతని పని. ప్రతిరోజూ ఇంటికి ఫోన్ చేసి తన క్షేమం తెలియజేసే ప్రవీణ్, నవంబర్ 22 తరువాత ఒక్కసారిగా అంతు చిక్కకుండా పోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.
Also Read
- Vande Mataram Row: ‘‘మహాత్మా గాంధీపై కూడా కేసు పెట్టాలి’’.. వందేమాతరం వివాదంపై ఖర్గే..
- Jio Prime Membership: జియో ప్రైమ్పై పెరుగుతున్న సందేహాలు.. రూ.299, రూ.300 మధ్య తేడా ఏంటి? క్లారిటీ ఇదే..
- Twisha Sharma: ట్విషా శర్మది హత్యా.. ఆత్మహత్యా? సీబీఐ ఏం తేల్చిందంటే..!
- Bangladesh: భారత్తో స్నేహం వద్దనుకుంటోందా.? తీస్తాపై బంగ్లాదేశ్ తీరు..
నవంబర్ 22 మరుసటి ఉదయం విధులు ముగించుకుని గదికి చేరుకునే క్రమంలో అతను అదృశ్యమైనట్లు తెలుస్తోంది. మాలి దేశంలోని ఉత్తర ప్రాంతంలో క్రియాశీలంగా పని చేసే Jama’a Nusrat ul-Islam wa al-Muslimin (JNIM) ఉగ్రవాద గుంపు అతడిని అపహరించినట్లు ఆ తరువాత వెలుగులోకి వచ్చింది. పది రోజుల తరువాత కుంటుంబం బోర్వెల్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించింది. ప్రవీణ్ కిడ్నాప్ కి గురైనట్లు కంపెనీ నిర్ధారించడంతో ఇంట్లో దుఃఖ వాతావరణం నెలకొంది. మాలిలో విదేశీయులను లక్ష్యంగా చేసుకునే గుంపులు ఇప్పటికే అనేక మందిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అదే గ్రూప్లో ప్రవీణ్ కూడా చిక్కుకున్నాడని అనుమానిస్తున్నారు. మాలి నుంచి పూర్తి వివరాలు రాలేదు. ఆ ప్రాంతంలోని అస్థిరత, ఉగ్రకేంద్రాల ప్రభావం కారణంగా గాలింపు చర్యలు కూడా కష్టతరంగా మారాయి. మరోవైపు.. ప్రవీణ్ తల్లిదండ్రులు, కుటుంబీకులు కొట్టుమిట్టాడుతున్నారు. తమ కుమారుడిని ఎలాగైనా రక్షించి దేశానికి తీసుకురావాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Tata Sons AGM: టాటా సన్స్ చరిత్రలో తొలిసారి.. AGM వాయిదా! అసలేం జరుగుతోంది?
-
Vande Mataram Row: ‘‘మహాత్మా గాంధీపై కూడా కేసు పెట్టాలి’’.. వందేమాతరం వివాదంపై ఖర్గే..
-
Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన ‘విశ్వనాథ్ & సన్స్’!
-
Jio Prime Membership: జియో ప్రైమ్పై పెరుగుతున్న సందేహాలు.. రూ.299, రూ.300 మధ్య తేడా ఏంటి? క్లారిటీ ఇదే..
-
NTR Trivikram: రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!