కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లేసి జగన్ను గెలిపించాం: బండి శ్రీనివాసరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెక్రటేరియట్లో కొనసాగుతున్న ఉద్యోగ సంఘాల నేతల బైఠాయింపు
సీఎస్ నుంచి సమాచారం కోసం ఎదురు చూస్తోన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటు ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ సెక్రటేరియట్లో బైఠాయించారు.ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ నేత బండి శ్రీనివాస్రావు సీఎం జగన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కుడి చేత్తో, ఎడం చేత్తో ఓట్లేసి జగన్ ను గెలిపించా మన్నారు. జగన్ను గెలిపించేందుకు మేం ఎంతో ప్రయత్నిం చామ న్నారు. లక్షల మంది ప్రతినిధులమైన మమ్మల్ని ఎందుకు పట్టించు కోవడం లేదని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. పీఆర్సీ నివేదిక కోసం ఇప్పటికే ఉద్యోగ సంఘాలుగా చాలా ఓపిక పట్టి ఎదురు చూశామని, అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు.
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
మా డిమాండ్ల కోసం అవసరమైతే విధుల బహిష్కరణ చేస్తామని గతంలో చెప్పాం. రెండు రోజుల్లో రిపోర్టు ఇస్తామని గతంలో సీఎస్ హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఆర్థికపరమైన బిల్లులు ఏవీ రావడం లేదు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఏ ఆస్పత్రిలో చెల్లడం లేదని ఆయన చెప్పారు. రీఎంబర్స్ మెంట్ పేమెంట్లు కూడా ఇవ్వడం లేదు. మేము ప్రభుత్వానికి సానుకాలంగా ఉన్నాం. అధికారులు మాపై అలసత్వం ప్రదర్శిస్తున్నారు. పీఆర్సీపై ఏం చేస్తున్నారో మాకు వెం టనే తెలియజేయాలి. ప్రభుత్వం మంచి మనసుతో మా బాధలు అర్థం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నివేదిక ఇస్తే తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తామని శ్రీనివాసరావు తెలిపారు.
భవిష్యత్ కార్యాచరణను రేపు ప్రకటిస్తాం: బొప్పరాజు, ఏపీజేఎసీ అమరావతి ఛైర్మన్
ప్రభుత్వం రెండేళ్లుగా పీఆర్సీ నివేదిక ఇవ్వకపోవడం బాధాకరమని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పీఆర్సీ నివేదిక ఇస్తారనే ఆశిస్తున్నామన్నారు. ఇవాళ నివేదిక ఇస్తే తీసుకుని వెళ్తాం. నివేదికను ఎందుకు రహస్యంగా దాస్తున్నారో అర్థం కావడం లేదని బొప్పరాజు అన్నారు. నివేదిక విడుదలను తరచూ వాయిదా వేస్తూ, తేదీలు తరచూ మార్చుతున్నా సహనంతో ఎదురు చూస్తున్నాం. పీఆర్సీ నివేదిక తీసుకున్నాకే ఇక్కడి నుంచి బయటకు వెళ్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!