Amaravati: నేటి నుంచి అమరావతిలో ముళ్ల కంపలు, తుమ్మ చెట్ల తొలగింపు ప్రారంభం..
- అమరావతిలో రాజధాని నిర్మాణ పనులకు తొలి అడుగు..
- నేటి నుంచి అమరావతిలోని పిచ్చి.. ముళ్ల.. తుమ్మ చెట్ల తొలగింపు కార్యక్రమం..
- మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కొనసాగనున్న ఈ తొలగింపు ప్రక్రియ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులకు తొలి అడుగు పడబోతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో వివక్షకు గురైన అమరావతి రాజధానిని మళ్లీ గాడిన పెట్టేందుకు వీలుగా టీడీపీ సర్కార్ తీసుకున్న చర్యలలో భాగంగా ఇవాళ (బుధవారం) తొలి అడుగుగా కంప చెట్లు, పిచ్చి చెట్లు, తుమ్మ చెట్ల తొలగింపు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అమరావతి రాజధాని అంతా గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పిచ్చి చెట్ల, ముళ్ల చెట్లతో మొత్తం అడవిలా మారిపోయింది. దీంతో వీటిని తొలగించేందుకు సీఆర్డీఏ అధికారులు 36.50 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవాల్సిన పరిస్థితి వచ్చింది.
Read Also: Anantapur Crime: దారుణం.. ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే..?
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అండ.. కీలక ప్రకటన..
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు రెగ్యులర్ బెయిల్
- Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
కాగా, సీఆర్డీఏ అధికారులు టెండర్లను ఇటీవలే ఖరారు చేశారు. ఎన్సీసీఎల్ సంస్థ ఈ టెండర్లను దక్కించుకోవడంతో.. నేటి (బుధవారం) ఉదయం 8 గంటలకు ఎన్సీసీఎల్ సంస్థ పిచ్చి, తుమ్మ చెట్ల తొలగింపు చేపట్టబోతుంది. సెక్రటేరియట్ వెనుక వైపున ఎన్ 9 రోడ్డు నుంచి ఈ పనులు స్టార్ట్ కానున్నాయి. మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ ఈ పనులను ఆరంభించనున్నారు. ఈ పనులపై మంత్రి మంగళవారం సీఆర్డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జంగిల్ క్లియరెన్స్ను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. రాజధాని క్యాపిటల్ పరిధిలోని మొత్తం 99 డివిజన్లలో ఒకేసారి పనులు మొదలు పెట్టబోతున్నామని వెల్లడించారు. నెల రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!