కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీతో ఏపీలోనూ పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గింది. రాష్ట్రంలోనూ పెట్రోల్ పై రూ. 1.51, డీజిల్పై రూ. 2.22 మేర వ్యాట్ తగ్గింది. డీజిల్ పై ఏడాదికి రూ. 888 కోట్లు, పెట్రోల్పై రూ. 226 కోట్ల మేర వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయంలో తగ్గనుంది. కేంద్రం తగ్గించిన ఎక్సైజు డ్యూటీ అనంతరం ఏపీలో డీజిల్ పై రూ. 8.68, పెట్రోలు పై రూ. 4.85 కు తగ్గింది వ్యాట్. ఏడాదికి రాష్ట్రంలో 150 కోట్ల లీటర్ల పెట్రోలు వినియోగం జరుగుతుంది. దీంతో వినియోగదారులకు రూ. 226 కోట్ల మేర లబ్ది కలుగుతుందని పేర్కొంది ప్రభుత్వ వర్గాలు. రాష్ట్రంలో ఏడాదికి 400 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతుంది. వ్యాట్ తగ్గింపుతో 888 కోట్ల రూపాయల మేర లబ్ది ఉందంటున్నారు ప్రభుత్వం. మొత్తంగా ఏడాదికి రూ. 1114 కోట్ల మేర ఏపీకి వ్యాట్ ఆదాయంలో తగ్గనుంది.