Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.. రికార్డ్ స్థాయిలో వరద..!
- ప్రకాశం బ్యారేజీ దగ్గర కొనసాగుతున్న కృష్ణమ్మ దూకుడు..
- ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక..
- రికార్డ్ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి 11.36 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో..
- ప్రకాశం బ్యారేజీకి 2009 నాటి కంటే ఎక్కువగా 15 వేల క్యూసెక్కుల నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakasam Barrage: కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయి వరద వచ్చి చేరుతోంది. 11 లక్షల 20 వేల క్యూసెక్కులకు వరద చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇక, బ్యారేజీలోని 70 గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని రిలీజ్ చేస్తున్నారు. బ్యారేజీ చరిత్రలో తొలిసారిగా రికార్డ్ స్థాయిలో వరద వచ్చింది.. 2009 అక్టోబర్లో 10 లక్షల 94 వేల క్యూసెక్కుల వరద రాగా.. 1903 వ సంవత్సరంలో 10 లక్షల 60 వేలు క్యూసెక్కుల వరద నీరు వచ్చింది.. ఇక, బ్యారేజీ దిగువ భాగాన అనేక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి.
Read Also: Rahul Gandhi : ఫేక్ వార్తలపై కాంగ్రెస్ అప్రమత్తం.. దేశవ్యాప్తంగా క్విక్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు
Also Read
- New ZPs: ఏపీలో జిల్లా పరిషత్ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
- Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
- AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
కాగా, ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తి అధికారులు నీటిని రిలీజ్ చేస్తున్నారు. బ్యారేజీ దగ్గర ఎప్పుడు లేని విధంగా 23.6 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో అవుట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంది. దీంతో రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. కృష్ణ కెనాల్ జంక్షన్ నుంచి కృష్ణా నది మీదుగా రైళ్లను డెడ్ స్లో చేసి నడుపుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Read Also: Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్ ఫాన్స్కు నిరాశ.. అప్డేట్స్ అన్నీ క్యాన్సిల్!
ఇక, ప్రకాశం బ్యారేజీ నుంచి రికార్డు స్థాయిలో వరద నీరు రావడంతో రామలింగేశ్వర నగర్ మునిగిపోయింది. ఇళ్లను ఖాళీ చేసి ప్రజలు బయటకి వెళ్లిపోతున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో నిన్నటి వరకూ ప్రజలు సురక్షితంగా ఉన్నారు. అయితే, శ్మశానం రోడ్ దగ్గర గోడ పైనుంచి లోపలకు వరద నీరు వచ్చి చేరుతుంది.. మొత్తం వెనక్కి తన్నడంతో నీరు ఇళ్లలోకి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే దివిసీమను సైతం వరద తీవ్రత తాకేసింది. పులిగడ్డ దగ్గర 21 అడుగులకు వరద నీరు చేరడంతో.. పులిగడ్డ అక్విడెక్టు నీటిలో చిక్కుకు పోయింది. మోపిదేవి మండలంలోని కే కొత్త పాలెం ఎస్సీ వాడలోకి వరద నీరు రావడంతో కాలనీలో నివాసం ఉంటున్న 600 మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు.
తాజావార్తలు
-
KTR : జీవో 97పై కేటీఆర్ ఫైర్.. విద్యార్థులకు కీలక హామీ
-
Maharashtra: డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయని భార్య.. దారుణానికి ఒడిగట్టిన భర్త..
-
Ishan Kishan: కెప్టెన్గా ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. రేపే తుది సమరం..
-
Iran-US War: మరోసారి యుద్ధం తీవ్రం.. ఖర్గ్ ద్వీపం దగ్గర భారీ పేలుళ్లు.. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్పై అమెరికా దాడి!
-
Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!